Sunday, August 2, 2015

జాతీయ పతాకం నియమాలు

జాతీయ పతాకాన్ని కొన్ని స్థలాలలో అన్నిరోజులూ , కొన్ని స్థలాలలో
కొన్ని సందర్భాలలో ఎగురవేస్తారు . జాతీయ పతాకం
ఎగురవేయడంలో సరియైన పద్దతులు , సంప్రదాయాలు
పాటించాలని కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు జారీ చేసినది .
వీటిని ఫ్లాగ్ కోడ్ - ఇండియాలో పొందు పరిచారు . దీనిలోని
ముఖ్యాంశాలు ఇలాఉన్నాయి .
అధికార పూర్వకంగా ప్రదర్శన కొరకు ఉపయోగించే పతాకం
అన్నిసందర్భాలలోనూ ఇండియన్ స్టాండర్డ్ సంస్థ
నిర్దేసించిన స్పెసిఫికేషన్స్కి కట్టుబడి ఉండి , ఐ .యస్ .ఐ
మార్కుని కలిగి ఉండాలి . మిగిలిన అనధికార సంధర్భాలలో కూడా
సరయిన కొలతలతో తయారైన పతకాలను ఉపయోగించడం
సమంజసం . జాతీయ జెండా కొలతలు : 21'X 14'; 12'X 8', 6'X 4', 3'X 2', 9'X6', సైజుల్లో ఉండాలి . సందర్భాన్ని బట్టి జెండా
ఏసైజులో ఉండాలో ఫ్లాగ్ కోడ్ లో పేర్కొన్నారు . జెండా
మధ్యభాగంలో ధర్మచక్రం నేవీ బ్లూ రంగులోనే ఉండాలి .
ధర్మచక్రంలో 24 గీతలు ఉండాలి .జాతీయజెండాని అలంకరణ
కోసం వాడకూడదు. అలానే జెండా ఎగురవేసేటప్పుడు ఎట్టి
పరిస్థితులలో నేలను తాకకూడదు. ఎగరవేసేటప్పుడు
వేగంగాను , అవనతం చేసేటప్పుడు మెల్లగానూ దించాలి .
కాషాయ రంగు అగ్రభాగాన ఉండాలి .సూర్యోదయానంతరం
మాత్రమే పతాకం ఎగురవేయాలి . అలాగే సూర్యాస్తమయం కాగానే
జెండాను దించాలి . పతాకాన్ని ఏవిధమయిన ప్రకటనలకు
ఉపయోగించరాదు . అంతేకాక పతాక స్థంభం పైన ప్రకటనలను
అంటించరాదు, కట్టరాదు . ప్రముఖనాయకులు , పెద్దలూ
మరణించిన సందర్భాలలో సంతాప సూచికంగా జాతీయ పతాకాన్ని
అవనతం చేయాలి . జాతీయ పతాకం వాడుకలో ఈ నియమాలన్నీ ప్రతి
భారతీయుడూ విధిగా పాటించాలి . జైహింద్!

Wednesday, July 1, 2015

మీరు కొనే వస్తువులు మంచివా లేక నకిలీవా

మీరు కొనే వస్తువులు మంచివా లేక నకిలీవా అని తెలుసుకోవడం చాలా అవసరం..
మీరు కొనే వస్తువులు ఏ దేశానివో తెలుసుకుని కొనడానికి ఉపయోగపడే
బార్ కోడ్స్ ఇవి..........ప్రతి ఒక్కరూ నోట్ చేసుకుని మోసపోకుండా మీకు నచ్చిన వస్తువులను కొనుక్కోండి........విజయ.కె.

00-13: USA & Canada
20-29: In-Store Functions
30-37: France
40-44: Germany
45: Japan (also 49)
46: Russian Federation
471: Taiwan
474: Estonia
475: Latvia
477: Lithuania
479: Sri Lanka
480: Philippines
482: Ukraine
484: Moldova
485: Armenia
486: Georgia
487: Kazakhstan
489: Hong Kong
49: Japan (JAN-13)
50: United Kingdom
520: Greece
528: Lebanon
529: Cyprus
531: Macedonia
535: Malta
539: Ireland
54: Belgium & Luxembourg
560: Portugal
569: Iceland
57: Denmark
590: Poland
594: Romania
599: Hungary
600 & 601: South Africa
609: Mauritius
611: Morocco
613: Algeria
619: Tunisia
622: Egypt
625: Jordan
626: Iran
64: Finland
690-692: China
70: Norway
729: Israel
73: Sweden
740: Guatemala
741: El Salvador
742: Honduras
743: Nicaragua
744: Costa Rica
746: Dominican Republic
750: Mexico
759: Venezuela
76: Switzerland
770: Colombia
773: Uruguay
775: Peru
777: Bolivia
779: Argentina
780: Chile
784: Paraguay
785: Peru
786: Ecuador
789: Brazil
80 – 83: Italy
84: Spain
850: Cuba
858: Slovakia
859: Czech Republic
860: Yugoslavia
869: Turkey
87: Netherlands
880: South Korea
885: Thailand
888: Singapore
890: India
893: Vietnam
899: Indonesia
90 & 91: Austria
93: Australia
94: New Zealand
955: Malaysia
977: International Standard Serial Number for Periodicals (ISSN)
978: International Standard Book Numbering (ISBN)
979: International Standard Music Number (ISMN)
980: Refund receipts
981 & 982: Common Currency Coupons

శ్రీకృష్ణుడి కుటుంబము

శ్రీకృష్ణుడికి భార్యలందరితోనూ ఒక్కొక్కరి వల్ల పదేసి మంది పిల్లలు పుట్టారు.
రుక్మిణి వల్ల కృష్ణుడికి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుబారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు అనే బిడ్డలు కలిగారు.
సత్యభామ వల్ల కృష్ణునికి భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే బిడ్డలు కలిగారు.
జాంబవతీ శ్రీకృష్ణులకు సాంబుడు, సుమిత్రుడు, పురజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతుడు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు అనే సంతానం కలిగింది. జాంబవతికి కలిగిన ఈ బిడ్డలంటే కృష్ణుడికి ప్రత్యేకమైన ప్రేమ ఉండేది.
నాగ్నజితి, కృష్ణులకు వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, లముడు, శంకుడు, వసుడు, కుంతి అనే పిల్లలు కలిగారు.
కృష్ణుడికి కాళింది వల్ల శ్రుతుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహుడు, భద్రుడు, శాంతి, దర్శుడు, పూర్ణమానుడు, శోమకుడు అనే కుమారులు జన్మించారు.
లక్షణకు, శ్రీకృష్ణుడికి ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనే సంతానం కలిగింది.
మిత్రవింద, కృష్ణులకు వృకుడు, హర్షుడు, అనిలుడు, గృద్ధుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాశుడు, పావనుడు, వహ్ని, క్షుధి అనే పుత్రులు పుట్టారు.
కృష్ణుడికి భద్ర అనే భార్య వల్ల సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, శూరుడు, ప్రహరణుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు అనే పిల్లలు పుట్టారు.
ఈ అష్ట మహిషులే కాక మిగిలిన పదహారు వేల వంద మంది కృష్ణుడి భార్యల ద్వారా కూడా ఒక్కొక్కరికి పది మంది సంతతి కలిగింది.
కృష్ణుడికి పదహారు వేల మంది గోపికలు. అన్ని వేల మంది తో కేవలం సరససల్లాపాలు మాత్రమె చేసాడు.
అల్లరి చేసాడు, అల్లరి పెట్టాడు.
అంతవరకే కానీ ఏ నాడు ఆయన అతిక్రమించలేదు.
గోపికలు కృష్ణుల మద్య ఉన్నది ఒక పవిత్రమైన చెలిమి మాత్రమే.
కృష్ణుడు భోగి గా కనిపించే యోగి.
ఇక నెమలి విషయానికి వస్తే ప్రపంచంలో సంభోగం చెయ్యని జీవి ఇది.
అత్యంత పవిత్రమైన జీవి కనుకే మన దేశానికి జాతీయ పక్షిగా ప్రకటించబడుతుంది.
పదహారు వేల మంది గోపికలు ఉన్నా కూడా శ్రీ కృష్ణుడు అత్యంత పవిత్రుడు.
అందుకే నెమలి పించం తలపై ఉండి శ్రీ కృష్ణ భగవానుడి పవిత్రతను తెలియజేస్తుంది.

జీ మెయిల్‌లో ఈ ఫీచర్స్ మీకు తెలుసా!


కంపోజ్‌ చేయడం, ఫైల్‌ను అటాచ్‌ చేయడం, సెండ్‌ కొట్టడం, అప్పుడప్పుడూ చాట్‌ చేయడం.. ఈ ఫీచర్స్‌ని ఉపయోగించడం అందరూ చేసేదే. ఇవే కాకుండా జీమెయిల్‌లో బోలెడు ఫీచర్స్‌ ఉన్నాయి. వాటిని తెలుసుకుంటే మరింత ఉపయోగం..
 
అన్‌డు సెండ్‌
చకా చకా మెయిల్‌లో టైప్‌ చేస్తారు. తొందరలో తప్పులను గుర్తించకుండా సెండ్‌ కొట్టేస్తారు. ఆ తరువాత అయ్యో తప్పులున్నాయి కదా అని తలపట్టుకుంటారు. ఒక్కసారి సెండ్‌ కొడితే మెయిల్‌ వెళ్లిపోయినట్లే కదా. కాని జీమెయిల్‌లో ఒక ఫీచర్‌ ఉంది. చాలా మందికి ఈ ఫీచర్‌ గురించి తెలియదు. సెండ్‌ కొట్టిన మెయిల్‌ను అన్‌డు కొట్టొచ్చు. అంటే మెయిల్‌ వారికి చేరకముందే ఆగిపోతుంది. ఇందుకోసం చేయాల్సిందల్లా జీమెయిల్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అన్‌ డు సెండ్‌ని ఎనేబుల్‌లో పెట్టుకోవాలి. ఎన్ని సెకన్ల పాటు వెయిట్‌ చేయాలో ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకి 30 సెకండ్లు సెలక్ట్‌ చేసుకుంటే కనుక మీరు మెయిల్‌ సెండ్‌ కొట్టిన 30 సెకండ్ల తరువాతే మెయిల్‌ వెళుతుంది. ఆ లోపు కావాలంటే అన్‌డు కొట్టొచ్చు.
 
కీబోర్డ్‌ షార్ట్‌కట్స్‌
షార్ట్‌కట్స్‌ను ఇష్టపడని వారు ఎవరుంటారు? కాని జీమెయిల్‌లో షార్ట్‌కట్స్‌ ఎలా? అంటే జీమెయిల్‌ ల్యాబ్స్‌లో కస్టమ్‌ కీబోర్డ్‌ షార్ట్‌కట్స్‌ ఫీచర్‌ అందుబాటులో ఉంది. ఇందులో మీ సొంత షార్ట్‌కట్స్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చు.
 
ఆటో అడ్వాన్స్‌
మీ జీమెయిల్‌ ఇన్‌బాక్స్‌లోకి రోజూ లెక్కలేనన్ని మెయిల్స్‌ వచ్చిపడుతూ ఉంటాయి. వాటిని ఓపెన్‌ చేసి పనికి రానివి డిలీట్‌ చేయడం, వెంటనే మళ్లీ ఇన్‌బాక్స్‌ స్ర్కీన్‌ ఓపెన్‌ కావడం... ఇదంతా తలనొప్పిగా ఉంటుంది. అలా కాకుండా జీమెయిల్‌ ల్యాబ్స్‌లో ఉన్న ఆటో అడ్వాన్స్‌ ఫీచర్‌ని ఎంచుకుంటే కనుక మెయిల్‌ డిలీట్‌ చేయగానే ఆ తరువాత మెయిల్‌ ఓపెన్‌ అవుతుంది. సింపుల్‌గా అనిపించినా ఈ ఫీచర్‌ మీ సమయాన్ని ఆదా చేస్తుంది.
 
సెండ్‌ అండ్‌ ఆర్చివ్‌
జీమెయిల్‌ జనరల్‌ సెట్టింగ్స్‌లో ‘షో సెండ్‌ అండ్‌ ఆర్చివ్‌’ బటన్‌ని ఎంచుకోవాలి. ఈ మెయిల్‌కు రిప్లై ఇచ్చాక సెండ్‌ కొడితే ఆ మెయిల్‌ ఇన్‌బాక్స్‌లో ఉండకుండా ఆర్చివ్‌ థ్రెడ్‌లోకి వెళుతుంది. సెంట్‌ మెయిల్‌లో ఆ మెయిల్‌ను చెక్‌ చేసుకోవచ్చు. ఇన్‌బాక్స్‌ క్లీన్‌గా ఉంచుకోవడానికి ఈ ఫీచర్‌ ఉపకరిస్తుంది.
 
యాప్స్‌ సెర్చ్‌
ఒకవేళ మీరు గూగుల్‌ డాక్స్‌, గూగుల్‌ సైట్స్‌ ఉపయోగిస్తున్నట్లయితే యాప్‌ సెర్చ్‌ ఫీచర్‌ మీకు బాగా ఉపయోగపడుతుంది. ల్యాబ్స్‌లో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. జీమెయిల్‌లో మీరు సెర్చ్‌ చేస్తున్నట్లయితే ఈ ఫీచర్‌ మీకు డాక్స్‌, సైట్స్‌లో ఉన్నవి కూడా సెర్చ్‌ చేసి చూపిస్తుంది. జీమెయిల్‌లో నుంచే ఫైల్‌ ఎక్కడుందీ వెతకొచ్చు.
 
రిప్లై ఆల్‌ను డిఫాల్ట్‌గా ఎంచుకోండి
కొన్ని మెయిల్స్‌ మల్టిపుల్‌ పీపుల్‌కి పంపించాల్సి ఉంటుంది. ఈమెయిల్‌ థ్రెడ్‌లో మల్టిపుల్‌ పీపుల్‌ ఇన్‌వాల్వ్‌ అయి ఉంటారు. మెయిల్‌ పంపించే సమయంలో రిప్లై ఆల్‌కు బదులుగా రిప్లై బటన్‌ని ఎంచుకుంటే ఒక్కరు తప్ప అందరూ ఆ మెయిల్‌ని మిస్‌ అయిపోతారు. అలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఉండాలంటే జీమెయిల్‌ జనరల్‌ సెట్టింగ్స్‌లో ఉన్న డిఫాల్ట్‌ రిప్లై బిహేవియర్‌లో రిప్లై ఆల్‌ని ఎంచుకోవాలి.
 
క్విక్‌ లింక్స్‌
ముఖ్యమైన మెయిల్స్‌కు స్టార్‌ పెట్టుకోవడం తెలిసిందే. అయితే అంతకన్నా సులభంగా ముఖ్యమైన మెయిల్స్‌ని యాక్సెస్‌ చేసుకునే విధంగా పెట్టుకోవాలంటే క్విక్‌ లింక్స్‌ని ఎంచుకోవాలి. జీమెయిల్‌ ల్యాబ్స్‌లో ఉన్న క్విక్‌ లింక్స్‌ని ఒక్కసారి ఎనేబుల్‌ చేస్తే చాలు. మెయిల్‌లో ఎడమవైపు ఒక బాక్స్‌ కనిపిస్తుంది. మీరు బుక్‌మార్క్‌ చేసుకున్న మెయిల్స్‌ అన్నీ ఇందులో ఒక్క క్లిక్‌ చేసుకునే విధంగా ఉంటాయి. ప్రత్యేక మెసేజ్‌లు, లేబుల్స్‌, సెర్చ్‌ చేసినవి..ఇలా అన్నీ ఇందులో ఉంటాయి.
 
అన్‌రీడ్‌ ఐకాన్‌
మీకు న్యూ మెయిల్‌ వచ్చినపుడు జీమెయిల్‌ ట్యాబ్‌ తెలియజేస్తుంది. కాని మీ ఇన్‌బాక్స్‌లో ఎన్ని అన్‌రీడ్‌ మెయిల్స్‌ ఉన్నాయో తెలుసుకోవాలంటే జీమెయిల్‌ ల్యాబ్స్‌లోని ‘అన్‌రీడ్‌ మేసేజ్‌ ఐకాన్‌’ ఉపయోగపడుతుంది.

స్పామ్‌ హ్యాండ్లింగ్‌
జీమెయిల్‌ అడ్ర్‌సలో డాట్‌కు ఉన్న ప్రాధాన్యం ఎంతో మీకు తెలుసా? ఉదాహరణకి మీ మెయిల్‌ durga.reddy@gmail.comఅనుకుందాం. అప్పుడు durgareddy@gmail.com లేక d.urgareddy@gmail.com మెయిల్‌ అడ్ర్‌సతో పంపిన మెయిల్స్‌ కూడా మీ ఇన్‌బాక్స్‌లోకి వస్తుంటాయి. ఈ ఇబ్బంది పోవాలంటే ఫిల్టర్‌ రూల్స్‌ని సెటప్‌ చేసుకోవాలి. ఒక్కసారి రిజిస్టర్‌ చేసుకుంటే చాలు. ఏయే మెయిల్‌ ఐడీల నుంచి మెయిల్స్‌ వచ్చే అవకాశం ఉందో ఆ మెయిల్‌ఐడీలను టైప్‌ చేసి ఈమెయిల్‌ ఫిల్టర్‌ క్రియేట్‌ చేసుకోవాలి. అప్పుడు ఆ ఐడీలతో వచ్చే మెయిల్స్‌ అన్నీ ఆటోమెటిక్‌గా డిలీట్‌ అవుతాయి.
 
సార్టింగ్‌ సులువు
ఎన్నో చోట్ల మెయిల్‌ ఐడీ ఇస్తుంటారు. ఎన్నో మెయిల్స్‌ వస్తుంటాయి. ఏ మెయిల్‌ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలంటే అన్నీ చెక్‌ చేయాల్సిందే. అలా కాకుండా మెయిల్‌ ఐడీని ఇచ్చే సమయంలోనే + ఫీచర్‌ని ఉపయోగించినట్లయితే సార్టింగ్‌ చేయడం సులువవుతుంది. ఉదాహరణకి మీరు ఆఫర్స్‌కు సంబంధించిన సమాచారం కోసం రిజిస్టర్‌ చేసుకుని ఐడీ ఇచ్చారనుకుందాం. ఆ సమయంలోనే ఐడీలో + ఫీచర్‌ని జోడించాలి. ఉదాహరణకి మీ మెయిల్‌ ఐడీ durga.reddy@gmail.com అయితే కనుక durga.reddy+offers@gmail.com అని టైప్‌ చేసి ఇవ్వాలి. ఇలా ఇచ్చినా మెయిల్స్‌ మీ ఇన్‌బాక్స్‌లోకే వస్తుంటాయి. మీరు సెర్చ్‌ చేసే సమయంలోoffers అని టైప్‌ చేస్తే చాలు. అక్కడి నుంచి వచ్చిన మెయిల్స్‌ అన్నీ కనిపిస్తాయి. అలా మీరు ఐడీ ఇచ్చిన ప్రతీ చోట ఒక్కో ఫిల్టర్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చు.
 
రీస్టోర్‌ అడ్రస్‌
స్మార్ట్‌ఫోన్‌లో నుంచి కాంటాక్ట్స్‌ను డిలీట్‌ చేస్తే గూగుల్‌ అకౌంట్‌లో నుంచి కూడా డిలీట్‌ అయిపోతాయి. అయితే డిలీట్‌ చేసిన ముప్పై రోజుల్లోగా వాటిని రికవరీ చేసుకోవచ్చు. ఇందుకోసం కాంటాక్ట్స్‌లోకి వెళ్లి, మోర్‌లో రీస్టోర్‌ కాంటాక్ట్స్‌పై క్లిక్‌ చేయాలి. డిలీట్‌ అయిన కాంటాక్ట్స్‌ అన్నీ స్టోర్‌ అవుతాయి.
 
డైలీ షెడ్యూల్‌
క్యాలెండర్‌ ఫీచర్‌ సహాయంతో రోజు వారి, నెల వారి షెడ్యూల్‌ను ప్లాన్‌ చేసుకోవచ్చు. క్రియేట్‌ చేసుకున్న క్యాలెండర్‌ను మెయిల్‌లో ఫ్రెండ్స్‌తో షేర్‌ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లోనూ ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. జీమెయిల్‌ క్యాలెండర్‌ ఫీచర్‌ని ఉపయోగించుకోవాలంటే మెయిల్‌ కుడివైపు పైభాగంలో ఉన్న గేర్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేయాలి. అందులో సెట్టింగ్స్‌లోకి వెళ్లి ల్యాబ్స్‌ని ఎంచుకోవాలి. తరువాత గూగుల్‌ క్యాలెండర్‌ గ్యాడ్జెట్‌ బటన్‌ని ఎనేబుల్‌లో పెట్టుకుని ఛేంజె్‌సని సేవ్‌ చేయాలి. సింపుల్‌గా ఉన్నా ఈ ఫీచర్స్‌ బాగా ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు కదూ.

కాంటాక్ట్స్‌ మెర్జ్‌
మెయిల్‌లో డూప్లికేట్‌ కాంటాక్ట్స్‌ ఉంటే చాలా చికాకుగా ఉంటుంది. ఏ ఐడీకి మెయిల్‌ పంపించాలో ఒక్కోసారి అర్థంకాదు. అలాంటప్పుడు కాంటాక్ట్స్‌ని మెర్జ్‌ చేస్తే సరిపోతుంది. ఇందుకోసం మెయిల్‌లో ఎడమవైపు పైభాగంలో ఉన్న కాంటాక్ట్స్‌లోకి వెళ్లాలి. అందులో ఫైండ్‌ డూప్లికేట్‌ కాంటాక్ట్స్‌ని ఎంచుకుంటే డూప్లికేట్స్‌ అన్నీ కనిపిస్తాయి. మోర్‌ ఆప్షన్‌లోకి వెళ్లి మెర్జ్‌ కాంటాక్ట్స్‌ని ఎంచుకుంటే కాంటాక్ట్స్‌ అన్నీ మెర్జ్‌ అవుతాయి.

Monday, June 29, 2015

ఇవి మీకు తెలుసా ?

• అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
• కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
• నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
• గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
• అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.
• జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.
• బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.
• సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
• మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.
• బీట్ రూట్.. బీపీని క్రమబద్దీకరిస్తుంది.
• మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
• దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.
• ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.
• అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.
• కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.
• మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.
• ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.
• బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.
• క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
• మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.
• ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.
• అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.
• పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.
• సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.
• దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.
• ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.
• చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
• కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.
• క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.
• యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.
• వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.
• పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.
• ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.
• ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
• ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.
• జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
• ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.
• నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
• మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.
• మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.

Saturday, June 27, 2015

ఉదయం తింటేనే మేలు

చాలామంది రాత్రిపూట భోజనం చేశాక పండ్లు తీసుకోవడానికి ప్రాధాన్యమిస్తారు. నిజానికి పండ్లని ఉదయం పూట అల్పాహారంతోపాటూ తీసుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో ఉపయోగాలు.
* పండ్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. యాపిల్‌, అరటి, నారింజ, పుచ్చకాయ వంటి వాటిలో గ్త్లెసమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువ. వీటిలో మేలు చేసే కార్బోహైడ్రేట్లు ఉంటాయి. జీవక్రియ మెరుగుపడుతుంది. ప్లేటు నిండా ఈ పండ్ల ముక్కలు తినేసి వెళితే రోజంతా ఉత్సాహంగా ఉంటుంది.
* పండ్లను ఉదయం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడటమే కాదు.. శుభ్రంగానూ ఉంటుంది. పండ్లు వ్యర్థాలనూ బయటకు పంపుతాయి. ఎలాంటి ఆహారం తీసుకున్నా ఇట్టే జీర్ణమవుతుంది. మలబద్ధకం కూడా బాధించదు. అలానే పండ్లలో లభించే పోషకాల్లో ఎంజైములు అధికంగా ఉంటాయి. ఇవి అరుగుదల మీద ప్రభావం చూపుతాయి.
* పండ్లను తీసుకోవడం వల్ల మానసికంగానూ సానుకూల ప్రభావం కలుగుతుంది. ఒత్తిడి దూరమవుతుంది. పండ్ల వల్ల శరీరంలోకి సహజ గ్లూకోజు అంది మొదడు ఉత్తేజితమవుతుంది. చదువుకొనే పిల్లలకు అల్పాహారంతో పాటు ఈ ముక్కలు తినిపిస్తే మంచిది. చదువుపై శ్రద్ధ పెడతారు.
* పండ్లలో లభించే విటమిన్‌ సి శరీరంలో రోగనిరోధకశక్తి పెంచుతుంది. రకరకాల ఇన్‌ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది. పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి నీటి శాతం ఎక్కువగానే అందుతుంది. డీహైడ్రేషన్‌ బాధించదు. దీనివల్ల చర్మం కూడా మృదువుగా మారుతుంది.
* బరువు తగ్గాలనుకునే వారు కాలానికనుగుణంగా దొరికే పండ్లను తీసుకోవడానికి ప్రాధాన్యమివ్వాలి. వ్యాయామాల అనంతరం, అల్పాహారం తీసుకున్నాక తినాలి. పొట్టనిండుతుంది. కెలొరీలు కూడా చేరవు.

పడుకునే ముందు తినకూడని ఆహారం...!

సరిగా నిద్ర రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ఒకటి మానసిక ఆందోళన. ఒత్తిడికి లోనయ్యేవారు కూడా సరిగా నిద్రపోలేరు. రోజు మనం తీసుకునే ఆహారం, సేవించే పానీయాలు, నిద్రను ప్రభావితం చేస్తాయి. నిద్రలేమికి మరో ముఖ్యం కారణం కూడా ఉంది. జీర్ణక్రియ సక్రమంగా జరుగకపోయినా నిద్రపట్టదు. జీర్ణక్రియ తీవ్రస్థాయిలో జరుగుతున్నప్పుడు నిద్రరావటం కష్టం. కాబట్టి రాత్రివేళ తీసుకునే ఆహారం విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలి. మరి రాత్రిల్లో తీనకూడని కొన్ని అధిక క్యాలరీ ఫుడ్స్ లిస్ట్ క్రింది విధంగా ఉన్నాయి… నిద్రించే ముందు మీరు ఖచ్చితంగా తినకూడని 10 హై క్యాలరీ ఫుడ్స్…
పిజ్జా: పెద్దగా జ్యూసిగా, రుచికరమైన పిజ్జా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వీటిని పగలు తింటే జీర్ణం అవ్వడానికి సరిపడా సమయం ఉంటుంది. అదే రాత్రుల్లో తీసుకుంటే, నిద్రించే సమయంలో అవయవాలన్ని చాలా నిధానంగా పనిచేయడం వల్ల జీర్ణక్రియకు కూడా నిధానం అవుతుంది. దాంతో తిన్న ఆహారం అరగక కొవ్వుగా మారుతుంది . పిజ్జా చాలా జిడ్డుగా ఉంటుంది. నూనెలతో తయారు చేయడం వల్ల గుండెల్లో ప్రమాదం పెరుగుతుంది. దాంతో హార్ట్ బర్న్ కు కారణం అవుతుంది.
షుగర్ క్యాండీస్: ఈ ప్రపంచంలో క్యాండీస్ అంటే ఇష్టపడని వారు ఉండరంటే ఆశ్చర్యపడాల్సిందే. ఎవరైనా సరే ఏదో ఒక వయస్సులో వీటిని టేస్ట్ చూసే ఉంటారు. అంతే కాదు, ఇప్పటీకి వీటి మీద మక్కువ ఏమాత్రం తగ్గదు. అయితే బరువు తగ్గించుకోవాలనుకొనే డైటర్స్ మాత్రం వీటికి దూరంగా ఉండాల్సిందే. ఎందుకంటే వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు పెరిగేలా చేస్తుంది. ఇవి రాత్రి సమయంలో తినడం వల్ల అలసటకు గురిచేస్తుంది. మీకు ప్రశాంతంగా మరియు పీస్ ఫుల్ గా నిద్రించాలంటే, జంక్ ఫుడ్స్ ను తీసుకోవడం నివారించి ఓట్ మీల్, లేదా తక్కువ క్యాలరీలున్న ఆహారం తీసుకోవాలి.
చాక్లెట్స్ : చాక్లెట్స్ లో ప్యాట్స్, కెఫిన్ మరియు కోకా అధికంగా ఉండటం వల్ల ఎసిడిటి సమస్యను తీవ్రతరం చేస్తాయి. డిన్నర్ తర్వాత కొన్ని డిజర్ట్స్ కు దూరంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రుల్లో చాక్లెట్స్ కు దూరంగా ఉండాలి. లేదంటే మీకు నిద్రలేకుండా చేస్తుంది.
వెజిటేబుల్స్: కూరగాయలు రుచికరమైనవి, న్యూట్రీషియన్ డైట్ ఫుడ్స్, కానీ రాత్రిల్లో నిద్రించే ముందు తీసుకోవడం అంత మంచిది కాదు, చాలా సింపుల్ కారణం : వెజిటేబల్స్ లోని ఉల్లిపాయ, బ్రొకోలీ లేదా క్యాబేజ్ వంటి అధిక మొత్తంలో కరగని ఫైబర్ ఉంటుంది. వీటి అరుగుదలకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. పగలు కంటే రాత్రిల్లో ఫైబర్ ఫుడ్స్ అరగడం చాలా కష్టం, దాంతో జీర్ణ వ్యవస్థ చాలా నిదానంగా జరిగి అపానవాయువు ఏర్పడటానికి కారణం అవుతుంది.
మద్యం/కార్బోనేటెడ్ డ్రింక్స్: చాలా మంది రాత్రి సమయంలో మద్యపానం సేవించడం వల్ల మంచి నిద్ర పడుతుందనుకుంటారు కానీ అది తప్పు. మద్యం నిద్రకు ప్రతికూల ప్రభావాలను కలిగి ఉండి, ఎక్కువ సార్లు రెస్ట్ రూమ్ కు పోయేలా చేసి నిద్రకు భంగం కలిగిస్తుంది. అతిగా మద్యపానం, నీటిని ఎక్కువగా తాగడం వల్ల కూడా నిద్రకు భంగం కలుగుతుంది. కాబట్టి నిద్రించే ముందు మితంగా తీసుకోవడం మంచిది. కాఫీ, టీ, కోలా డ్రింక్స్‌, సాఫ్ట్‌ డ్రింక్స్‌, సోడా, తదితరాలను మానేయాలి. ఇవి ఆన్నాశయంలోని వాల్వులను వదులయ్యేలా చేసి యాసిడ్‌ని అన్ననాళం లోకి లీక్‌ అయ్యేలా చేస్తాయి. దాంతో ఎసిడిటికి కారణం అవుతుంది. ఫలితంగా నిద్రలేమి. కాబట్టి ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్ కు దూరంగా ఉండటం చాలా మంచిది.
బర్గర్స్: ఇతర ఫ్యాటీ ఫుడ్స్, హై క్యాలరీ ఫుడ్స్, చీజ్ బర్గర్స్ వంటి ఆహారాలను నింద్రించే ముందు తప్పనిసరిగా నివారించాలి. ఎందుకంటే అవి కడుపులో నేచురల్ యాసిడ్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి హార్ట్ బర్న్ కు దారితీస్తుంది.
చిల్లీ సాస్/టమోటో సాస్: చిల్లీ సాస్ కొన్నిమసాలా దినుసులతో చేర్చినప్పుడు చాలా ఆరోగ్యం మరియు ఉపయోగకరం. కానీ అలాగే వేటితోనూ కలపకుండా సపరేట్ గా తీసుకోవడం చాలా ప్రమాధకరం. ఈ హై క్యాలరీ ఫుడ్ ప్రోటీనులు మరియు స్లో బర్నింగ్ కార్బోహైడ్రేట్స్ ను కలిగి ఉంటుంది. టమోటో సాస్ యాసిడ్ రిఫ్లెక్షన్ కు కారణం అవుతుంది మరియు జీర్ణక్రియను నిధానం చేస్తుంది . పిజ్జా చీజ్ తో నింపి ఉంటుంది మరియు టమోటో సాస్ కూడా. కాబట్టి రాత్రుల్లో దీన్ని అవాయిడ్ చేయడం బెస్ట్.సిడిటి ఉన్నవారు టమోటోలను పూర్తిగా మానేయమని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. సాధారణంగా టమోటో జ్యూసీగా ఉండి ఎసిడిటికి కారణం అవుతుంది. దాంతో ఛాతీలో మంట పుడుతుంది. నిద్రలేమికి కారణం అవుతుంది

నిండు నూరేళ్లు… పళ్లు గట్టిగా ఉండాలంటే….?

ఇటీవల … నిజంగా జరిగిన ఘటన… ఓ 90 ఏళ్ల ముసలావిడ కన్నుమూశాక యధావిధిగా అంతిమసంస్కారాలు పూర్తిచేశారు. ఆశ్చర్యంగా దహనం తర్వాత బూడిదలో చూస్తే… ఆవిడ 32 పళ్లు అలాగే గట్టిగా ఉన్నాయి. అబ్బురపడ్డ బంధుమిత్రులతో ఆ ఇంటివాళ్లు చెప్పిన వృద్ధురాలి దంత రహస్యం ఏంటో తెలుసా…?
ఆవిడ ఆహార అలవాట్లు పద్ధతిగా పాటించటంతో పాటు.. వారానికోమారు త్రిఫల చూర్ణం రెండు చెంచాలు రాత్రంతా చెంబుడు నీళ్లలో కలిపి ఉంచి… ఉదయాన్నే అవి అయిపోయేదాకా పుక్కిలించేదట. దానివల్ల పళ్ల చిగుళ్లలో క్రిములతో పాటు… లోలోపల దాక్కున్న బాక్టీరియా సైతం పోయి…. అదిగో అలా 90 ఏళ్లు వచ్చినా… అన్ని పళ్లు… అంతే గట్టిగా ఉన్నాయన్న మాట.
అప్పట్లో… వజ్రదంతి యాడ్ వచ్చేది…. ఒక ముసలి వ్యక్తి చలాకీగా వాల్ నట్ కొరికేవాడు… అది ప్రచార ప్రకటన.. మరి నిజంగా జరుగుతున్నదేంటి…? ఇప్పుడు.. వీధికో దంతవైద్యుడు… అది పట్టణాళ్లో… మరి రాజధానిలో… వీధికి పది అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. కారణం… జంక్ ఫుడ్ … అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు… అంటే… మరీ వేడిగా… లేదా టూమచ్ చల్లగా …. తినటం..తాగటం… వీటికి తోడు పిజ్జాలు, బర్గర్లు, పఫ్ లు, వివిధ రకాల కేక్స్… హిమక్రీములు… ఇంకా అనేకం. నాటి తరం వాళ్లు దంపుడు బియ్యంతో పాటు… సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే రకరకాల కూరగాయలు, పళ్లు తినేవాళ్లు. ఎప్పుడో పండగలప్పుడు మాత్రమే…. మిఠాయిలు… మరిప్పుడు… తినాలనిపిస్తే చాలు స్వీట్లు.
ఇక పిల్లలకైతే… పుట్టినప్పుడు మొదలుపెడితే… ఎల్కేజీ, యూకేజీ వచ్చేటప్పటికే.. కేజీల లెక్కన చాక్లెట్లు తిని పళ్లు పుచ్చిపోతున్నాయి. సో.. 90 సంగతి పక్కన పెట్టండి… పాతికేళ్లలోపే పండ్లు కట్టించుకోవాల్సిన పరిస్థితి…అందుకే డెంటల్ డాక్టర్లలోనూ రకరకాల స్పెషలైజేషన్లు… మనం కొనుక్కోవటానికి డిఫరెంట్ టారిఫ్ ల్లో … రకరకాల పళ్లు… కాబట్టి … పళ్లు కాపాడుకోవాలా….? కొనుక్కోవాలా…?
ఇది పూర్తిగా మనమీద ఆధారపడి ఉంది. ఎలా..అంటే…మన ఆహార అలవాట్లు కొద్దిగా మార్చుకోవటం మాత్రమేకాదు.. దంత సంరక్షణ కోసం … మరీ రసాయనిక పేస్టుల మీద ఆధారపడకుండా… సహజమైన ఉత్పత్తులు వాడితే మంచిది.

కలలో కనిపించే జంతువులు - వాటి అర్ధాలు

కలలో కనిపించే ఇంకొన్ని జంతువుల ప్రాముఖ్యత ఇప్పుడు చూద్దాం.
.
కుందేలు
కలలో కనిపించే జంతువులు - వాటి అర్ధాలు
ఇమేజ్
కుందేలు అదృష్టానికి గుర్తు. మీ భవిష్యత్తు ప్రయత్నాలు మీకు అనుకూలంగా తిరుగుతాయని అర్ధం. తెల్ల కుందేలు నిజమైన ప్రేమకు సూచన. పచ్చిక బయళ్ళలో దూకుతూ, ఆడుకుంటున్న కుందేళ్ళు పిల్లల వలన కలగబోయే సంతోషాన్ని సూచిస్తాయి.
.
లేడి
లేడి దయ, సౌమ్యత, మరియు సహజ అందానికి గుర్తు. ఇది మీలోని సున్నిత భావాలకు సూచన. నల్ల లేడి కనిపిస్తే, మీరు మీలోని సున్నిత భావాలను తిరస్కరిస్తున్నట్లు. లేడిని చంపుతున్నట్లు కల వస్తే మీలోని సున్నిత భావాలను, ఇంకా దయ, సౌమ్యతను అణిచివేయటానికి ప్రయత్నిస్తున్నట్లు అర్ధం.
.
ఏనుగు
కలలో ఏనుగు కనిపిస్తే, మీరు ఇతరుల పట్ల ఇంకా. ఎక్కువ అవగాహనతో, సహనంతో ఉండాలని అర్ధం. ఏనుగు శక్తి, బలం, మరియు తెలివికి చిహ్నం. అంతేకాక, ఇది మీలోని అంతర్ముఖ వ్యక్తిత్వానికి సూచన కావచ్చు. ఏనుగు మీద స్వారీ చేస్తున్నట్లు కల వస్తే, మీరు ఒకప్పుడు భయపడిన, మీలోని దాగబడిన అంశాలు మీ నియంత్రణలో ఉన్నాయని అర్ధం.
.
మేక
మేక పరిస్థితులను సరిగా అంచనా వేయలేకపోవటాన్ని, అవివేకాన్ని సూచిస్తుంది. మేకపోతు కనిపిస్తే, మీ పోటీదారులు మీవ్యాపారాలను కూల్చివేయటానికి ప్రయత్నిస్తున్నారని అర్ధం.
.
గుర్రం
గుర్రం బలమైన భౌతిక శక్తికి సూచన. నల్ల గుర్రం హింస మరియు క్షుద్ర శక్తులకు, తెల్ల గుర్రం స్వచ్ఛత, శ్రేయస్సు అదృష్టానికి సూచన. చనిపోయిన గుర్రం ఒకప్పుడు మీకు బలం కలిగించింది ఏదో మీ జీవితంలోనుండి పోయిందని, ఇప్పుడు లేదనే దానికి సూచన. అడవి గుర్రాలమంద బాధ్యతా రాహిత్యానికి గుర్తు. గుర్రం మీద స్వారీ చేస్తూ అది మీనియంత్రణలో ఉంటే, అక్రమ మార్గాల ద్వారా విజయం సాధించడానికి ప్రయత్నిస్తారని, నియంత్రణలోలేని గుర్రం మీద స్వారీ చేస్తూ ఉంటే, మీ కోరికలు మిమ్మల్ని స్థిమితంగా ఉండనీయవని అర్ధం.
.
పాము
ఎక్కువమందికి కలలో కనిపించే జంతువులలో పాము కూడా ఒకటి. పాము ప్రమాదకరమైన, నిషిద్ధ లైంగికతకు ప్రతీక. కలలో పాము కాటు వేస్తే మీలో దాగబడ్డ భయాలు, ఆందోళనలు ఉన్నాయని, అవి మిమ్మల్ని బాగా భయపెడుతున్నాయని అర్ధం. ఇది మీరు నిజజీవితంలో ఎదుర్కోబోయే ప్రమాదానికి సూచన కావచ్చు. కలలో పాము తరుముతుంటే, మీరు వద్దనుకుంటున్న పరిస్థితిలోనే మీరు చిక్కుకోవాల్సి వచ్చిందని, లేక వస్తుందని అర్ధం.
.
పంది
పంది మురికి, అత్యాశ, స్వార్ధానికి గుర్తు. మీలో ఉన్న స్వార్ధాన్ని లేక అత్యాశను వదిలించుకుంటే కానీ విజయావకాశాలు దరి చేరవని అర్ధం.
.
గొర్రె
గొర్రె ప్రయత్నలేమిని, చొరవలేనితనాన్ని సూచిస్తుంది. సృజనాత్మకతను పెంచుకొని, కొత్త మార్గాల్లో వెళ్ళటానికి మీరు మొగ్గు చూపరని, నలుగురితోపాటు నారాయణా అనటానికే ఇష్టపడతారని అర్ధం.
.
సింహం
సింహం బలానికి, దూకుడుకి, శక్తికి ప్రతీక. మీరు ఇతరులపై ఎక్కువ ప్రభావం చూపుతున్నారని, ఇతరులతో మంచి సంబంధాలు కొనసాగించాలంటే దీనిని నియంత్రించవలసిన అవసరం ఉందని అర్ధం. సింహం మీపై దాడి చేసినట్లు కల వస్తే, మీరు ఎన్నో అడ్డంకులను అధిగమించవలసిన అవసరం ఉందని సూచిస్తుంది.
.
పులి
పులి శక్తికి, వివిధ పరిస్థితులను ఎదుర్కోవటానికి కావలసిన మీ సామర్థ్యానికి, నాయకత్వ లక్షణానికి సూచన. బోనులో ఉంచబడిన పులి అణచివేయ్యబడిన భావోద్వేగాలకు, దాడి చేస్తున్న పులి, ఆ భావోద్వేగాల వల్ల కలిగే భయానికి గుర్తు.
.
తాబేలు
తాబేలు మీరు జీవితంలో ముందుకు పోవడానికి అవకాశాలు వెతుక్కోవలసిన అవసరాన్ని సూచిస్తుంది. మీకు ఎదగటానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి, కానీ దాని కోసం సరి అయిన అడుగు వేయాలని అర్ధం.

Thursday, June 25, 2015

ఆషాఢ మాసం.....

''ఆషాఢ మాసం కాదిది, నవవధూవరుల సరస శృంగారాల, సురభిళ సింగారాల, ప్రవిమల ప్రణయాల, వియోగాల విరహాల, అరూడ మాసం'' అన్నడో కవిమిత్రుడు.
ఆషాడం లో అత్తా అల్లుళ్ళు ఎదురుపడోద్దు అని ఒక ఆచారం ఉంది. దీని వెనక ఒక అర్థం చెబుతారు.
పూర్వం వ్యవసాయమే జీవనాధారం .సంపాదన ఎలా ఉన్నా, తినడానికి కొన్ని గింజలు ఉండాలని, క్రొత్త వలపు మోజులో తినడానికి ఆధారమైన వ్యవసాయాన్ని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తారో అనీ ఈ నిబంధన పెట్టారు.
మరో అర్థం ఏమిటంటే - ఈ మాసంలోని వాతావరణం చాలా మార్పులు ఉంటాయి. ఇప్పుడు కొన్ని అంటువ్యాధులు బాగా ప్రబలుతాయి. పుట్టబోయే బిడ్డ మీద వాటి ప్రభావం ఉండొద్దని కూడా అంటారు. ( పిండానికి తొలి మూడు నెలలు చాలా ముఖ్యమైనదని - ఆ సమయములోనే అవయవాలు ఏర్పడుతాయనే ఈ మధ్యనే సైంటిస్టులు తెలియచేశారు.) పుట్టింటికి పోయిన వధువు ఇంట్లోనే ఉంటుంది. ఆమెకి తోడుగా ఆమె అమ్మ కూడా ఉంటుంది.
ఇంకో కారణం ఆషాడం తరవాత శ్రావణం లో అన్నీ పూజలూ, పునస్కారాలు జరుగుతూ ఉంటాయి. అందులో దాదాపుగా అన్నీ మంచి రోజులూ ఉంటాయి. ఆ శుభరోజులలో గర్భధారణ జరిగితే - మంచిది అని ఆలోచన. పైన చెప్పానుగా జన్మించిన సమయం కన్నా, గర్భధారణ సమయం ముఖ్యమని పూర్వకాలములో అనుకున్నారు. ఇప్పుడు అలా అయితే చాలా బాగుంటుంది అని వారి ఆలోచన. ఇప్పుడు గర్భము ధరిస్తే తొమ్మిది నెలలకి అంటే (శ్రావణం, భాద్రపదం.. అలా చూస్తే చైత్రం వస్తుంది. అంటే ఉగాది పండగ దగ్గరలో..) నిండు వేసవిలో - ప్రసవం జరుగుతుంది. పుట్టిన పిల్లలకి కాస్త తల్లిపాల వల్ల వ్యాధి నిరోధక శక్తి వస్తుంది. తద్వారా పిల్లలు వానాకాలములో వచ్చే వ్యాధులని తట్టుకుంటారు అని కూడా కావచ్చును.వేసవి కాలంలో ప్రసవం అటు తల్లికీ ... ఇటు బిడ్డకి కూడా అంత మంచిదికాదు కాబట్టి పెద్దలు ఈ ఆచారాన్ని వెలుగులోకి తెచ్చారని చెప్పుకోవచ్చు.
ఇంకోకారణం ఒక నెల వియోగం తరవాత కలుసుకున్నాక వారు ఎంతో అన్యోన్య దాంపత్యాన్ని పొందుతారని అని అంటారు కూడా.

ఆరోగ్యంగా వుండాలంటే ఏ వారం ఏ రోజున ఏ రకమైన ఆహారం తినాలి .

మొక్కలు, పండ్లు వంటివి కూడా గ్రహ సంచారంపై ఆధారపడి పెరుగుతూంటాయి. కనుక కొన్ని రోజులలో తినే ఆహారాలు ఔషద విలువలు కలిగి శరీరంచే పీల్బడతాయి. గ్రహాలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయనేది చూడండి.
మన ఆహారంపై ఆదివారం సూర్యుడి ప్రభావం వుంటుంది. కనుక మనం ఏ రకమైన ఆహారం తిన్నప్పటికి తేలికగా జీర్ణం అయి శరీరం పీల్చేస్తుంది. గోదుమలతో చేసినవి తినటం మంచిది.రాగులతో చేసినవి తినచ్చు.
సోమవారం చంద్రుడి ప్రభావం వుంటుంది. చంద్రుడు నీటి సంబంధ గ్రహం. కనుక నీరు అధికంగా వుండే, గుమ్మడి, దోస, పుచ్చ పండు వంటివి తింటే బాగా జీర్ణం అయిపోతాయి.
మంగళవారం కుజుడి ప్రభావం వుంటుంది. కుజుడు వేడి గ్రహం. కనుక వేడిపుట్టించే మామిడిపండు, పైన్ ఆపిల్, ఉల్లిపాయ, మిరియం, వెల్లుల్లి, మొదలైనవి బాగా పీల్చబడి త్వరగా జీర్ణం అవుతాయి.
బుధవారం బుధుడి ప్రభావం వుంటుంది. ఈ గ్రహం రెండు రకాలు కనుక ఏ ఆహారం ఈ రోజు తీసుకున్నా పరవాలేదు. పచ్చ పెసర్లుతో చేసినవి,పచ్చబఠానితో చేసినవి తినచ్చు.
గురువారం, గురుగ్రహ ప్రభావం వుంటుంది. పసుపు లేదా ఆరెంజ్ రంగు ఆహారాలు అంటే ఆరెంజ్, నిమ్మ, అరటిపండు, మొదలైనవి తినండి.
శుక్రవారం శుక్రుడి ప్రభావం వుంటుంది. శుక్రుడు ప్రేమ వ్యవహారాలకు, సంబంధించిన ఆహారాలు, బాదం, పిస్తా, బాదంపప్పు, జింక్ అధికంగా వుండే ఆహారాలైన డార్క్ చాక్లెట్, వేయించిన గుమ్మడి గింజలు, వంటివి తనటం ప్రయోజనకరం.
శనివారం శని ప్రభావం వుంటుంది. శని నూనెలపై ఆధిపత్యం కలిగి వుంటాడు. కనుక నూనె ఆహారాలు, జంక్ ఫుడ్ ఈ రోజు బాగా జీర్ణం అవుతుంది. మన ఆహారం భూమి ద్వారా వస్తుంది. భూమిలో అన్నిరకాల ఎనర్జీలు వుంటాయి.
మనం తినే ఆహారం భూమినుండి నెగెటివ్ మరియు పాజిటివ్ శక్తులు కలిగి వుంటుంది. మనం సంతోషంగా వుంటే, సరైన ఆహారం తింటాం. మన దుఖం లేదా విచారంతో వుంటే మనం తినే ఆహారాలు మారుస్తూ సంతోషం కొరకు ప్రయత్నిస్తాం.
జీర్ణక్రియ సమస్యలు తరచుగా వస్తూవుంటే....మీ జాతకంలోని బలహీన గ్రహాలను బలం చేసేటందుకు ప్రయత్నించాలి. మీ జీవన నాణ్యతను మెరుగుపరచుకుంటూ వేగంగా జీర్ణం కలిగించుకోవాలి కనుక మీ బలహీన గ్రహాలేవో తెలుసుకోండి. బలహీన గ్రహాలను ఎలా బలపరచాలి?
వైద్య సలహాలకు జ్యోతిషం, గ్రహాలు ప్రత్యామ్నాయాలు కావు, కాని, అది మీకు ఆరోగ్య అంశాలలో ఎన్నో వివరాలను అది అందిస్తుంది. జ్యోతిషం ముందస్తుగా మీ వ్యాధుల అవకాశాలను తెలుపటమే కాదు వాటిని నివారించుకోడానికి అవసరమైన చర్యలను కూడా తెలుపుతుంది.

ఆహారంలో avoid చేయాల్సినవి.....

విలైనంత వరకు గుర్తుంచుకొని ఇవన్నీ ఆహారములో నిషేదిన్చాల్సినవట ....
1. తేనే (honey) మరియు నెయ్యి (gee) కలిపి తినకూడదు. ఆ రెండిటి కలయిక విషపూరితం అయినది. Don't mix honey and ghee it is poisonous.
2. పెరుగు (curd) లేక చల్ల ను (butter milk) అరటి పండు తో కలిపి తినకూడదు. Done eat banana with curd or buttermilk.
3. అన్నాన్ని (rice) పండ్లతో (fruits) కలిపి తినకూడదు. అలా తినడం వల్ల పండ్లలోని minerals తగ్గిపోతాయి. Don't eat fruits with rice u loose minerals.
4. కూరగాయలతో (vegetables) కలిపి వెన్నె (cheese) కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం. Don't eat cheese with vegetables. If so it is dangerous.
5. చేపల కూర (fish curry) తిన్నవెంటనే పాలు (milk) కానీ, పెరుగు (curd) కానీ తినకూడదు. అలా తింటే కుష్టి రోగం వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. Don't drink milk or curd after fish curry if so u will get leporsy.
6. లావుగా ఉన్నవారు బియ్యం (rice) తో వండివి కాకుండా గోధుములతో (wheat) ఆహార పదార్ధాలు తీసుకోవడం మంచిది..
Fat people instead of rice they should have wheat products.
7. ఆస్తమా (asthma) రోగులు టమోటా (tomato), గుమ్మడికాయ (pumpkin), ముల్లంగి (radish) వారు తీసుకొనే ఆహారంలో వాడకూడదు. అలాగే వారు తల మీద ఎక్కువ తేమను కూడా ఉంచుకోవడం మంచిది కాదుasthma people shouldn't suppose to eat tomato, radish , pumpkin and their hair should not be wet.
8. మొలలు (piles) ఉన్నవారు గుడ్లు (eggs), మాంసం (meat) తినకూడదు. Piles people - don't eat eggs, meat.
9. నెయ్యిని రాగి (copper) పాత్రలో ఉంచి తినకూడదు. Don't use ghee if it is in copper vessel.
10. పొద్దునే bed coffee తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు. పొద్దునే మంచి నీరు తాగిన తరువాత త్రాగవచ్చు . Early in the morning bed coffee is not good instead drink water.
11. అల్సర్ (ulcer) వ్యాదితో భాద పడుతున్నవారు కారాన్ని తినకూడదు. Ulcer people don't eat spicy food.
13. చర్మ వ్యాధులు (skin diseases) ఉన్నవారు పొట్ల కాయ (snake guard), పల్లీలు (pea nuts), ఎండు చేపలు (dry fish), చిక్కుడు కాయలు (Broad beans) తినకూడదు. Skin diseases people- don't eat snake guard, pea nuts, dry fish, broad beans.
14. నువ్వుల నునేతో (sesame oil) తో గోధుమ wheat కి చెందినవి చెయ్యకూడదు. Don't use Wheat and sea same oil together.
15. మోకాళ్ళ నొప్పులతో (arthritis) ఉన్నవారు మాంసం (meat), గుడ్లు( eggs) తో చేసిన వంటలు తినకూడదు. Arthritis people don't eat meat and eggs.
వీలైనంత వరకు గుర్తుంచుకొని పాటించండి.. ఆరోగ్యం బాగా చూసుకోండి. ఆరోగ్యమే మహా భాగ్యం కదా!! Pls Remember the above points and take necessary steps. Health is wealth....
(Ayurveda)

అరిటాకులో భోజనం

- అరిటాకులో భోజనం అనాదిగా వస్తున్న ఆచారం..గౌరవానికి ప్రతీక.
- అరటి ఆకులోని ఔషధ విలువలు… రోగనిరోధక శక్తిని పెంచుతాయి
- వేడి పదార్థాలు వడ్డించగానే…ఆకు మీది పొర కరిగి అన్నంలో కలుస్తుంది. దీనివల్ల అద్భుతమైన రుచితో పాటు, జీర్ణశక్తి కూడా వృద్ధి అవుతుంది.
- అరిటాకు… ఎన్నో విటమిన్లు, పోషకాల నిలయం
- ఎన్నో జబ్బుల్ని హరించే శక్తి అరిటాకులో ఉంది.
- వివిధ కాన్సర్లు (మెదడు, ప్రొస్టేట్, సర్వైకల్, బ్లాడర్)లతో పాటు Hiv, సిక్కా, పార్కిన్సన్ వ్యాధులపై అరిటాకులోని ఔషధ విలువలు ప్రభావం చూపుతాయి.
- అంతేనా… వాడిపారేసిన ఆకులు మట్టిలో సులభంగా కలిసిపోయి, పర్యావరణానికి మేలు చేస్తాయి.
- కొసమెరుపేంటంటే… అరిటాకులో విషపూరితమైన ఆహారాన్ని వడ్డిస్తే... ఆకు వెంటనే నల్లగా మాడిపోతుంది. కాబట్టి శతృవు భోజనానికి పిలిచినా.... వడ్డించేది అరిటాకులో అయితే... నిర్భయంగా, ప్రశాంతంగా భోజనం చేయొచ్చు.
- అరిటాకులో భోంచేయండి… జీవితాన్ని అమృతమయం చేసుకోండి.

గురక తగ్గే మార్గం

ప్రశాంతమైన నిద్ర ఆయువును పెంచి ఆరోగ్యవంతమైన జీవితాన్నిస్తుంది. అంతటి విలువైన నిద్రకు భంగం కలిగించే గురక గురించి తెలుసుకోండి...
గురకకు కారణాలు ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఊపిరితిత్తులలోకి గాలి తీసుకునే ముక్కు, నోరుల గాలి ద్వారాలు స్త్రీలలో కంటే మగవారిలో చాలా ఇరుకుగా ఉంటాయి. ఈ కారణం చేత ఆడవారిలో కంటే మగవారిలోనే ఎక్కువగా గురక సమస్య కనబడుతుంది. ఇరుకుగా ఉంటే నోటి ద్వారం, ముక్కుల్లో పెరిగే కొవ్వు కండలు మొదలైన సమస్యలు గురక రావడానికి వంశపార్య కారణాలుగా చెప్పవచ్చు. తరచుగా తుమ్ములు, దగ్గు, జలుబుతో బాధపడే వారిలో ముక్కు రంధ్రాలు శ్లేష్మంతో మూసుకొనిపోయి గాలి పీల్చుకోలేని స్థితిలో గురక మొదలై బాధిస్తుంది. మద్యపానం, పొగతాగడం కొన్ని రకాల మందులు తీసుకోవడం వల్ల కండరాలు బిగువు కోల్పోయి గురక ఎక్కువ అవుతుంది. చాలా మందిలో స్థూలకాయం కూడా గురకకి ప్రధానమైన కారణంగా మారి ఇబ్బంది పెడుతుంది.
గురకని గుర్తించే కొన్ని మార్గాలు
నోరు మూసుకొని గురకపెడితే మీ నాలుకలోనే సమస్య ఉందని అర్థం.
నోరు తెరచి గురకపెడితే మీ గొంతులోని మృదువైన కణజాల సమస్యగా గుర్తించాలి.
వెల్లకిలా పడుకొని గురకపెడితే ప్రధాన సమస్యగా పరిగణించాలి.
ఏ రకంగా నిద్రపోయినా గురక వస్తుంటే దాన్ని తీవ్ర సమస్యగా గుర్తించాలి.
విముక్తికి గృహ వైద్యం..
గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్‌మెంటు ఆయిల్‌ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు బాగా పుక్కిలించాలి.
కొద్దిగా పిప్పర్‌మెంటు ఆయిల్‌ను చేతి వేళ్లకు రాసుకొని వాసన చూస్తుంటే గురక తగ్గిపోతుంది.
అర టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌, అర టీ స్పూన్‌ తేనె కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే గురక తగ్గుతుంది.
మరిగే నీటిలో 4, 5 చుక్కలు యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి తలకు ముసుగు పెట్టి రాత్రి నిద్రపోయే ముందు 10 నిమిషాల పాటు ముక్కు ద్వారా ఆవిరి పీల్చాలి.
ఆవు నెయ్యిని రోజూ కొద్దిగా వేడి చేసి కరిగించి రెండు చుక్కల చొప్పున రెండు ముక్కు రంధ్రాలలో పోసి పీల్చుతుంటే తగ్గుతుంది.
అర టీ స్పూన్‌ యాలకుల చూర్ణం ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే చక్కటి ఫలితం లభిస్తుంది.
2 టీ స్పూన్ల పసుపు పొడిని కప్పు వేడి పాలల్లో కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే గురక తగ్గుతుంది.

Tuesday, June 23, 2015

మహిమ

ఒక చిన్న గ్రామంలో ఒక తల్లి తన బిడ్డ గోపీతో వుండేది. ఆమెకు భర్త లేడు, ఒక్కడే పిల్లాడు. అన్నెం పున్నెం యెరుగని బాలుడు.
ఆ తల్లి చాలా కష్టాలు పడేది పిల్లవాడిని
పోషించడానికి. భగవతుడిని నమ్ముకుని బ్రతికేది. వూరికి దూరంగా వున్న బడిలో గోపీ చదువుకునేవాడు. రోజు నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవాడు.

సాయంత్రం చింతతోపు లోంచి నడుచుకుంటూ ఇంటికి రావటానికి చాలా భయ పడేవాడు. వేరే పిల్లలంతా తల్లి-తండ్రులతోనో, బళ్ళల్లోనో
వచ్చేవారు.
ఒక రోజు గోపీ తన తల్లితో అన్నాడు, అమ్మా నువ్వు రోజూ నాకు పెరుగన్నమే పెడతావు, నేనేమీ పంచభక్ష్య పరమాన్నాలు అడగటం
లేదు. కానీ రోజు చింతతోపు లోంచి
రావాలంటే చాలా భయమేస్తుందమ్మా!
నువ్వు రోజూ నాకు తోడు రాలేవా?”
నాయనా! నీ పేరే గోపీ, గోపాల క్రిష్ణుడి
పేరు పెట్టుకున్నాను. ఆయనే నీకు దిక్కు. భగవంతుడే మనకు రక్ష! భయం కలిగినప్పుడల్లా, “అన్నా! గోపాలా!” అని తలుచుకో, ఆయనే చూసుకుంటాడు అంతా.” అని ధైర్యం చెప్పింది.
ఆ మాటను అక్షరాలా పఠించేవాడు గోపీ.
సాయంత్రాలు భయమేసినప్పుడల్లా, అన్నా! గోపాలా!” అని తలుచుకునేవాడు. ధైర్యంగా
భయం లేకుండా చింతతోపు దాటుకుని ఇంటికి వచ్చేసేవాడు.
ఒక రోజు బడిలో అయ్యవారు తన కూతురి పెళ్ళికి అందరినీ ఆహ్వానించాడు. అందరూ పిల్లలు తల్లి తండ్రులని అడిగి బహుమతులు తీసుకుని వెళ్ళాలని నిశ్చయించుకున్నారు.
సాయంత్రం ఇంటికి వస్తూ పిల్లాడు, “అన్నా! గోపాలా!” అని పిలిచాడు.
ఏం బహుమతి తీసుకుని వెళ్ళాలి, పాపం మా అమ్మ ఏం ఇవ్వగలదు?” అని అడిగాడు. అమ్మ ఏమిస్తే అదే సరిలే అనుకున్నాడు. పెళ్ళిరోజు చక్కగా స్నానం చేసి, వున్న వాటిల్లో మంచి బట్టలు వేసుకున్నాడు. వాళ్ళ అమ్మ ఇచ్చిన
చిట్టి పిడతలో పెరుగు జాగ్రత్తగా పట్టుకెళ్ళాడు. అందరూ ఖరీదైన బహుమానాలు తీసుకుని వచ్చారు.
కొంత మంది పిల్లలు గోపీ తెచ్చిన బహుమానం చూసి నవ్వేరు. కాని అయ్యవారు చాలా ఆప్యాయంగా గోపీని ఇంట్లోకి రమ్మని, ఆ చిట్టి పిడతని తీసుకుని పక్కగా పెట్టారు. గోపీని
కూడ అందరి లాగానే సత్కరించారు.
విందులో అందరినీ కూర్చోమన్నారు. పప్పూ, కూరలూ, పులుసులూ ఆరగించారు. పులిహోరా, మిఠాయివుండలూ, జాంగ్రీలూ వగైరా ఆస్వాదించారు. చివరిగా పెరుగు
వడ్డించ మన్నారు. చిట్టి పిడతలో వున్న పెరుగు ఒక్కరికి సరిపోతుందనుకుని, అయ్యవారు
ముందు ఆ గిన్నిలోని పెరుగు ఒకరి
విస్తరలో వంపేరు.
ఆశ్చర్యం! తిరిగేసరికి ఆ పిడతలో మళ్ళి
పెరుగు నిండిపోయింది. ఈ లోపల ఆ పెరుగు తింటున్న వ్యక్తి, “అద్భుతం! అమోఘం! ఈ
పెరుగేంటి ఇంత రుచిగా వుంది, ఎక్కడనించి తెప్పించారు?” అన్నాడు. వేరే వాళ్ళంతా, యేది, మాకు వడ్డించండి, మేమూ
చూస్తాము”, అన్నారు.
అయ్యవారు పిడతలో పెరుగు అందరికి వడ్డించడం మొదలెట్టారు. అసలు యెంత మందికి అందులోంచి పెరుగు వడ్డించినా,
అందులో మళ్ళీ మళ్ళీ పెరుగు నిండిపోయింది.
వచ్చిన వారంతా కూడా ఆశ్చర్యపోయారు. ఈ మహిమ యేమిటొ అని అయ్యవారు గోపీని అడిగారు. గోపీ జరిగిందంతా చెప్పాడు. అందరూ యేది, అన్నా! గోపాలా! అని పిలూ,
మేమూ చూస్తాము!” అన్నారు.
అయ్యవారు అందరిని మందలించారు. “
మనలాంటి వాళ్ళకు కనిపించాల్సిన అవసరం
దేవుడికిలేదు. ఈ బాలుడి వల్ల మనం ఈ రోజు ఈ మహిమ చూడగలిగాము.” అన్నారు.
అందరూ ఆకాశం వైపు చూశారు.

తెనాలి రామకృష్ణుడి తెలివి తేటలు

ప్రక్క రాజ్యానికి రాజైన నవాబు మీ రామకృష్ణుడు
చాలా తెలివి గలవాడని విన్నాము.ఆయన తెలివిని
మాకు కొంచెం పంపించ గలరు. అని వ్రాసి తన
దూత తో పంపించాడు.

రాయలు రామకృష్ణుడి వైపు చూశాడు. రామకృష్ణుడు తల వూపి యింటికి
వెళ్ళిపోయాడు. యింటికి వెళ్లి తన పెరట్లో పచారు చేస్తూ ఆలోచిస్తూ వుండగా అతని దృష్టి అక్కడే పాకి వున్న గుమ్మడితీగ పై పడింది.
దానికి ఒక చిన్న పిందె కాసి వుండటం
కనిపించింది.అంటే అతనికి ఒక ఉపాయం
తట్టింది. బజారుకు వెళ్లి చిన్న మూతి గల కుండ నొకదానిని కొనుక్కొచ్చాడు.మెల్లగా అ పిందెను ఆ కుండ లో దించాడు.
మరుదినం సభకు వెళ్లి ఒక నెల తర్వాత నేనే
పంపుతానని చెప్పి ఆ దూతను పంపించి
వేశాడు.
నెల తర్వాత ఆ పిందె పెరిగి ఆ కుండ నిండా
అయింది.రామకృష్ణుడు తొడిమ కత్తిరించి ఆ
కుండను ఒక దూతకు యిచ్చినవాబుకు
పంపుతూ ఈ కుండను పగుల గోట్టకుండా
తెలివిని తీసుకోవలిసిందని వ్రాసి పంపించాడు.
ఆ నవాబుకు కుండను పగుల గోట్టకుండా దాన్ని
ఎలా బయటకు తియ్యాలో తెలియక మాకు దాన్ని బయటకు తియ్యడ మేలాగో
తెలీలేదు.మీ రామకృష్ణుడిని పంపి తీసి
యిమ్మని వ్రాసి పంపించాడు.
రామకృష్ణుడు ఆ నవాబు సభకు వెళ్లి ఆ కుండను తెప్పించి
ఒక పదునైన కత్తిని కూడా తెమ్మన్నాడు.ఆ
కట్టి తీసుకొని మెల్లగా కుండలో పెట్టి
నిదానంగా ఆ గుమ్మడి కాయను ముక్కలుగా
కోశాడు.చెయ్యి పెట్టి మెల్లగా ఒక్కో ముక్కనే
బయటికి తీశాడు.సభలోని వారంతా ఆశ్చర్యంగా
చూస్తూ వుండి పోయారు.
నవాబు
రామకృష్ణుడిని మెచ్చుకొని చాలా
బహుమానాలిచ్చి గౌరవంగా సాగనంపాడు.

డబ్బుకు లోకం దాసోహం

సిరిపురంలో రాజా, రంగాలవి పక్కపక్క ఇళ్లు. పక్కపక్క పొలాలూనూ. వాళ్లిద్దరూ చిన్న నాటి నుంచి ప్రాణస్నేహితులు. ఒక రోజు పని ఉండి పట్నం వెళ్లదలిచారు.
ఉదయం బయల్దేరి అడ్డదోవన అడవి దారి గుండా వెళితే అదే రోజు సాయంత్రానికి ఇంటికి చేరుకోవచ్చు. అసలే పొలం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. చాలా సమయం ఆదా అవుతుందని భావించి అడవి దారి పట్టారు.
మిత్రులిద్దరూ పాటలు పాడుకుంటూ కబుర్లు, నవ్వులతో దారంతా హోరెత్తిస్తూ సరదా సరదాగా ప్రయాణం సాగిస్తున్నారు. అది ప్రమాదకరమైన జంతువులు లేని చిన్న అడవే.
అయినా చేతి కర్రలతో అప్రమత్తంగానే ఉన్నారు. ఇంతలో మార్గ మధ్యంలో తళతళ మెరుస్తూ ఒక వజ్రపుటుంగరం రాజా కళ్ల బడింది. ఆశ్చర్యానందాలతో దానిని తీసుకున్నాడు రాజా. మిత్రులిద్దరూ తిరిగి నడవసాగారు. కానీ
ఈసారి వారి మధ్య మౌనం రాజ్యమేల సాగింది. ఆ వజ్రం విలువ ఎన్ని లక్షలు ఉంటుందో దానితో తాను ఏ స్థిరాస్తులు సమకూర్చుకోగలడో ఆలోచించసాగాడు రాజా.
ఆకస్మికంగా మిత్రుడికి పట్టిన అదృష్టానికి మనసులోనే ఈర్ష్య చెందసాగాడు రంగా. ఆ ఉంగరం తనకు దొరికితే ఎంత బాగుండేదో అని వూహించుకోసాగాడు. మొత్తానికి కబుర్లకి కళ్లెం పడి పరధ్యానంలో మునిగిపోయారు ఎవరికి వారే.
అకస్మాత్తుగా గుబురుగా ఉన్న పొదల్లోంచి చరచర పాకుతూ వారికి అడ్డు వచ్చిందో నల్లతాచు. ఒక్క క్షణం ఆలస్యమైనా అది రంగా పాదంపై కాటు వేసేదే. మెరుపులా తప్పుకున్నాడు రంగా.
పాము బాటను దాటి పొదల్లోకి పాకుతూ పోయింది. వూపిరి పీల్చుకున్నారు మిత్రులిద్దరూ. నేనంటే ఆ ఉంగరం అమ్మితే ఎంతొస్తుందో, ఏం కొనొచ్చో ఆలోచిస్తున్నాను. నువ్వెందుకు పరాకుగా ఉన్నావ్‌? అన్నాడు రాజా చిరాకు పడుతూ. నీ దగ్గర దాపరికమెందుకు? నాకే ఆ ఉంగరం దొరికితే ఎంత బాగుండేదా అనుకుంటున్నఅన్నాడు రంగా నిజాయితీగా.
ఇంతలో ఓ వ్యక్తి ఆదుర్దాగా దారంతా వెతుకుతూ వారికి ఎదురు వచ్చాడు. ఉంగరం పోగొట్టుకున్నాడని తెలుసుకుని ఆనవాళ్లు అడిగి అతడి ఉంగరం అతడికి ఇచ్చేశాడు రాజా.
ఎంతో సంతోషంగా వారికి తన చేతిలోని మిఠాయిల డబ్బా ఇచ్చాడా వ్యక్తి. వారితో కలిసి నడవసాగాడు. రాజా, రంగాల మధ్య పాటలు, కబుర్లు, సందడి తిరిగి చోటు చేసుకున్నాయ్‌.
అయాచితంగా వచ్చిన డబ్బు కోసం ఆశ, ఆలోచనలు వారి కబుర్లు, ఆనందాల్ని ఎలా అణిచేసిందో, డబ్బుకు లోకం దాసోహం అని అంతా ఎందుకంటారో అప్పుడర్థమైంది వారికి.

యముడి కొడుకు యమహా!

ఓసారి యముడు భూలోకానికి వచ్చినప్పుడు ఓ అందాల సుందరిని చూశాడు. ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని అతడికి అనిపించింది. వెంటనే మనిషి రూపం ధరించి ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె అందమైనదే కానీ ఒట్టి గయ్యాళి. పెళ్లయిన మర్నాటి నుంచే చీటికీ మాటికీ అతడిని సాధించేది. ఆమె మీద ఉండే ప్రేమతో యముడు అదంతా భరించేవాడు. కొన్నాళ్లకు వారికో ఓ కొడుకు పుట్టాడు.
కొడుకు యువకుడయ్యేసరికి యముడికి భార్యంటే మొహం మొత్తింది. ఆమె గొంతు వింటేనే కంపరం పుట్టుకొచ్చేది. ఇక ఎంత మాత్రం ఆమెను భరించలేనని నిర్ణయించుకున్న యముడు తన కొడుకును దగ్గరకు పిలిచి జరిగిందంతా చెప్పి, 'ఇక నాకు ఈ జీవితంపై విరక్తి కలిగింది. నా కొడుకుగా నీకొక గొప్ప రహస్యం చెబుతా. నువ్వు వైద్య వృత్తిని ప్రారంభించు. నువ్వు ఏ రోగిని చూసినా అతడికి నయం అయ్యేటట్టు వరమిస్తున్నా. అయితే ఏ రోగి తల దగ్గరైనా నేను కనిపిస్తే మాత్రం వైద్యం చేయకు. ఎందుకంటే వాళ్ల చావు తప్పదన్నమాట' అంటూ అదృశ్యమైపోయాడు. తండ్రి చెప్పినట్టే ఆ యువకుడు వైద్యవృత్తిని చేపట్టి గొప్ప హస్తవాశి కలవాడుగా పేరుపొందాడు. ఓసారి ఆ దేశపు రాకుమారికి తీవ్రమైన అనారోగ్యం ఏర్పడింది. పెద్ద పెద్ద వైద్యులు కూడా నయం చేయలేకపోయారు. రాజు వెంటనే రాజ్యమంతటా చాటింపు వేయించి రాకుమారి జబ్బు తగ్గించినవారికి ఆమెనిచ్చి పెళ్లి చేయడంతో పాటు రాజ్యాన్ని కూడా అప్పగిస్తానంటూ ప్రకటించాడు.
ఆ ప్రకటన విన్న యువకుడు ఉత్సాహంగా రాజధాని బయల్దేరి రాకుమారిని చూశాడు. ఆమెను పరీక్షిస్తూ చుట్టూ చూసేసరికి తలదగ్గర తండ్రి కనిపించాడు. ఆమె చనిపోక తప్పదని అతడికి అర్థం అయింది. రాకుమారిని రక్షిస్తే జీవితాంతం సుఖంగా బతకవచ్చనుకున్న యువకుడికి ఏం చేయాలో తోచలేదు. కాసేపు ఆలోచించిన అతడికి ఓ ఉపాయం తోచింది. వెంటనే గది గుమ్మం వరకూ పరిగెత్తి బయటకి చూస్తూ, 'అమ్మా! త్వరగా రా. నాన్నగారు ఇక్కడే ఉన్నారు' అంటూ అరిచాడు.
కొడుకు కేక వినగానే యమభటుడికి చెమటలు పట్టాయి. గయ్యాళి భార్యను చూడవలసి వస్తుందనే భయంతో చటుక్కున అదృశ్యమైపోయాడు. దాంతో ఆ యువకుడి వైద్యం ఫలించింది. రాకుమారిని పెళ్లాడి, రాజవ్వాలన్న అతడి ఆశ కూడా నెరవేరింది!

ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు

ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు
చూడచూడ రుచుల జాడవేరు
పురుషులందు పుణ్య పురుషులువేరయ
విశ్వదాభిరామ వినుర వేమ
.
భావం - ఉప్పూ,కర్పూరం రెండూ చూడటానికి ఒకేలా ఉంటాయి.కానీ వాటి రుచులు
మాత్రం వేరు వేరు.అలాగే పురుషుల్లో పుణ్యపురుషులు వేరుగా ఉంటారు.

బెండ ఆరోగ్యానికి అండ….!!

బెండకాయలతో చేసిన వంటకాలు తినడానికి చాలామంది ఇష్టపడతారు. బెండకాయల్ని ఫ్రై, సాంబారు, పులుసు, కర్రీల్లో ఎక్కువగా వాడతారు. అయితే బెండకాయలు ఆరోగ్యానికి ఎంతమేలు చేస్తాయనేది మీకు తెలుసా..?
బెండకాయల్లోని మ్యూకస్ వంటి పదార్ధం ఉంటుంది. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలకు..ఎసిడిటీకి చక్కని పరిష్కారం. డయాబెటీస్ తో బాధపడేవారు ఎక్కువగా బెండకాయలతో చేసిన వంటకాలు తినడం మంచిది.
బెండకాయల్ని నిలువుగా చీల్చి .. రెండు సగాల్ని గ్లాసుడు నీటిలో రాత్రంతా ఉంచి మర్నాడు ముక్కలు తీసివేసి .. ఆనీటిని తాగితే సుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
బెండకాయల్లో ఎక్కువగా ఉండే ఎ, బి, సి విటమిన్లు, పలు పోషక పదార్థాలు, అయోడిన్ అనేక రకాల అనారోగ్యాలకు చెక్ పెడతాయి.
సో వీలైనంతగా బెండకాయల్ని మీ ఆహారపదార్ధాల్లో చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి

Monday, June 22, 2015

మేలు చేసే మునక్కాయ!!!

నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునక్కాయలో ఉంది. కొన్ని వందల శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయి. ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉన్నాయి. విటమిన్ ఎ, సి, క్యాల్షియం, పొటాషియం ఇందులో ఎక్కువగా వుంటాయి.
ఆకును కూడా వంటల్లో వినియోగిస్తారు. పచ్చటి ఆకులే కాక కొంచెం నీడలో ఎండబెట్టి, పొడిచేసి నిలువ కూడా వుంచుకోవచ్చు. అవసరమైనపుడు సంవత్సరం పొడవునా అందుబాటులో వుంటుంది. సి విటమిన్ తప్ప మిగిలిన పోషకాలేవీ నశించవు, తగ్గవు. వంద గ్రాముల ఆకుల్లో కాల్షియం - 440 మిల్లీ గ్రాములు, ఐరన్- 0.85 మి.గ్రా, బీటా కెరోటీన్లు అధికంగా వుంటాయి.
అంతేగాకుండా.. మునక్కాయ ఎముకల్ని బలంగా ఉంచుతుంది. ఇందులో ఐరన్, క్యాల్షియం ఎముకల్ని బలపరుస్తుంది. పిల్లల పెరుగుదలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంకా చక్కెర స్థాయిల్ని స్థిరంగా ఉంచుతుంది. తద్వారా డయాబెటిస్ను నియంత్రించుకోవచ్చు. వీటిలోని విటమిన్ “సి” ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది

Sunday, June 21, 2015

గర్భస్థ శిశువుకు మన మాటలు అర్ధమౌతాయా?

తల్లి గర్భంలో ఉన్న శిశువుకు మాటలు వినిపిస్తాయని, అర్ధమౌతాయని పురాణ కథనాలు అనేకం ఉన్నాయి. ఇవి అతిశయోక్తులు కాదు, ఇందులో నిజం ఉందని ఉదాహరణ సహితంగా తెలియజేశాయి ధార్మిక గ్రంధాలు.
అభిమన్యుడు పెరిగి పెద్దయ్యాక పద్మవ్యూహం గురించి నేర్చుకోలేదని, తల్లి గర్భంలో ఉండగానే అవగాహన చేసుకున్నాడని భారతంలో వర్ణించారు. అర్జునుడు ఒకసారి సుభద్రకు యుద్ధవిద్యలో పద్మవ్యూహం కష్టతరమైనది అంటూ పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో, చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరించి చెప్పాడు. అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు ఆ విద్యను అర్ధం చేసుకున్నాడు. అయితే, పద్మవ్యూహం నుండి ఎలా బయటపడాలో అర్జునుడు సుభద్రకి చెప్పలేదు. కనుకనే తర్వాతి కాలంలో అభిమన్యుడు యుద్ధంలో చాకచక్యంగా పద్మవ్యూహం ఛేదించుకుంటూ లోనికి వెళ్ళి వీరోచితంగా పోరాడాడు కానీ ఆ వ్యూహం నుండి బయటపడలేక ప్రాణాలు కోల్పోయాడు.
హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు కూడా తల్లి గర్భంలో ఉండగా నారదుడి మాటలు విని ఆకళింపు చేసుకున్నాడని, అందువల్లనే పుడుతూనే విష్ణుభక్తుడు అయ్యాడని చెప్తారు. నారదుడు లీలావతికి చేసిన ఉపదేశం ఆమె కంటే కూడా ఆమె గర్భంలో పెరుగుతున్న ప్రహ్లాడునికే ఎక్కువ ఉపయోగపడ్డాయి.
నేర్చుకోవడం అనేది గర్భస్థ సిసువుగా ఉన్నప్పుడే ప్రారంభమౌతుందని ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా అనేక పరిశోధనలు చేసి నిరూపిస్తున్నారు. కడుపులో ఉన్న పిండానికి ముందుగానే వినికిడి శక్తి ఏర్పడుతుందని, దాంతో తల్లితో ఇతరులు మాట్లాడే మాటలు, తల్లి ఇతరులతో చెప్పే సంగతులు విని గ్రహించగాలుగుతారని నిపుణులు, మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు.
గర్భస్థ శిశువు మన మాటలు వింటుంది, గ్రహిస్తుంది కనుక గర్భిణీ స్త్రీలను వీలైనంత ప్రశాంతంగా ఉండమని, ఆవేశాలు, అరుపులకు దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. ఎంత మంచి మాటలు వింటూ, ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగితే శిశువు అంత ఆరోగ్యంగా పుట్టి పెరుగుతుంది అని సూచిస్తున్నారు.

కుడివైపునకు తిరిగి మనం ఎందుకు నిద్రలేవాలి?

నిద్రకు ఉపక్రమించడం, నిద్రలేవడం మరియు రోజును గడిపే విధానాల గూర్చి మన సంప్రదాయం ఎన్నో విషయాలను వెల్లడిచేస్తుంది. మనం ఉదయాన నిద్రలేచే విధానం రోజులో మనం చురుకుగా లేదా మందకోండిగా వుండటంపై ప్రభావాన్ని చూపుతుందని మన పాత తరం వారు విశ్వసించేవారు.
ఉదయాన నిద్రలేచేటప్పుడు కుడివైపునకు తిరిగి లేవాలని చెప్పబడిన ఋషివాక్కు మన ఆరోగ్యానికి సంబంధిచినది. నేటి పాశ్చాత్య వైద్యులు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తూ పాటించాల్సిన అంశంగా సూచిస్తున్నారు.
మన శరీరం చుట్టు రెండు అయస్కాంత వలయాలు ఉన్నాయి. మొదటిది పాదం నుండి తలవరకు, తల నుండి పాదం వరకు తిరుగుతుంది. రెండవది ఎడమ వైపునుండి కుడికి, కుడివైపు నుండి ఎడమకు మన చుట్టుతా తిరుగుతుంది. అనుకూల దిశగా మన శరీర కదలిక వల్ల రెండవ వలయ ప్రవాహం ప్రభావితమై బలం చేకూరుస్తుంది.
ఒకవేళ ఈ రెండు వలయాలు ఒకదానికొకటి విరుద్ద దశలో ఉంటే శరీర యంత్రాంగం బలహీనపడును. ఈ విషయాన్ని గుర్తించిన ఆధునిక సైన్స్ కుడివిఎపునకు తిరిగి లేవడం వల్ల వలయ ప్రవాహం బలం పుంజుకుంటుందని తెలుపడం జరుగుతోంది.
పిల్లలు తమ పనిలో మందకోడిగా ఉన్నట్లయితే ఎడమవైపునకు తిరిగి నిద్రలేచావని పెద్దలు ఈ కారణంగానే మందలిస్తారు.

ఆరోగ్యంగా వుండాలంటే ఏ వారం ఏ రోజున ఏ రకమైన ఆహారం తినాలి .

మొక్కలు, పండ్లు వంటివి కూడా గ్రహ సంచారంపై ఆధారపడి పెరుగుతూంటాయి. కనుక కొన్ని రోజులలో తినే ఆహారాలు ఔషద విలువలు కలిగి శరీరంచే పీల్బడతాయి. గ్రహాలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయనేది చూడండి.
మన ఆహారంపై ఆదివారం సూర్యుడి ప్రభావం వుంటుంది. కనుక మనం ఏ రకమైన ఆహారం తిన్నప్పటికి తేలికగా జీర్ణం అయి శరీరం పీల్చేస్తుంది. గోదుమలతో చేసినవి తినటం మంచిది.రాగులతో చేసినవి తినచ్చు.
సోమవారం చంద్రుడి ప్రభావం వుంటుంది. చంద్రుడు నీటి సంబంధ గ్రహం. కనుక నీరు అధికంగా వుండే, గుమ్మడి, దోస, పుచ్చ పండు వంటివి తింటే బాగా జీర్ణం అయిపోతాయి.
మంగళవారం కుజుడి ప్రభావం వుంటుంది. కుజుడు వేడి గ్రహం. కనుక వేడిపుట్టించే మామిడిపండు, పైన్ ఆపిల్, ఉల్లిపాయ, మిరియం, వెల్లుల్లి, మొదలైనవి బాగా పీల్చబడి త్వరగా జీర్ణం అవుతాయి.
బుధవారం బుధుడి ప్రభావం వుంటుంది. ఈ గ్రహం రెండు రకాలు కనుక ఏ ఆహారం ఈ రోజు తీసుకున్నా పరవాలేదు. పచ్చ పెసర్లుతో చేసినవి,పచ్చబఠానితో చేసినవి తినచ్చు.
గురువారం, గురుగ్రహ ప్రభావం వుంటుంది. పసుపు లేదా ఆరెంజ్ రంగు ఆహారాలు అంటే ఆరెంజ్, నిమ్మ, అరటిపండు, మొదలైనవి తినండి.
శుక్రవారం శుక్రుడి ప్రభావం వుంటుంది. శుక్రుడు ప్రేమ వ్యవహారాలకు, సంబంధించిన ఆహారాలు, బాదం, పిస్తా, బాదంపప్పు, జింక్ అధికంగా వుండే ఆహారాలైన డార్క్ చాక్లెట్, వేయించిన గుమ్మడి గింజలు, వంటివి తనటం ప్రయోజనకరం.
శనివారం శని ప్రభావం వుంటుంది. శని నూనెలపై ఆధిపత్యం కలిగి వుంటాడు. కనుక నూనె ఆహారాలు, జంక్ ఫుడ్ ఈ రోజు బాగా జీర్ణం అవుతుంది. మన ఆహారం భూమి ద్వారా వస్తుంది. భూమిలో అన్నిరకాల ఎనర్జీలు వుంటాయి.
మనం తినే ఆహారం భూమినుండి నెగెటివ్ మరియు పాజిటివ్ శక్తులు కలిగి వుంటుంది. మనం సంతోషంగా వుంటే, సరైన ఆహారం తింటాం. మన దుఖం లేదా విచారంతో వుంటే మనం తినే ఆహారాలు మారుస్తూ సంతోషం కొరకు ప్రయత్నిస్తాం.
జీర్ణక్రియ సమస్యలు తరచుగా వస్తూవుంటే....మీ జాతకంలోని బలహీన గ్రహాలను బలం చేసేటందుకు ప్రయత్నించాలి. మీ జీవన నాణ్యతను మెరుగుపరచుకుంటూ వేగంగా జీర్ణం కలిగించుకోవాలి కనుక మీ బలహీన గ్రహాలేవో తెలుసుకోండి. బలహీన గ్రహాలను ఎలా బలపరచాలి?
వైద్య సలహాలకు జ్యోతిషం, గ్రహాలు ప్రత్యామ్నాయాలు కావు, కాని, అది మీకు ఆరోగ్య అంశాలలో ఎన్నో వివరాలను అది అందిస్తుంది. జ్యోతిషం ముందస్తుగా మీ వ్యాధుల అవకాశాలను తెలుపటమే కాదు వాటిని నివారించుకోడానికి అవసరమైన చర్యలను కూడా తెలుపుతుంది. 

కరక్కాయ

దీని శాస్త్రీయ నామము " terminalia chebula. సంస్కృతం లో "హరిటకి" అంటారు . కరక్కాయ వాత
తత్వము పై పనిచేస్తుంది . బుద్ధిని వికషింప జేస్తుంది . బలం కలిగిస్తుంది , ఆయుహ్ కాలం పెంచుతుంది
ఉప్పు తప్ప అన్ని రుచులు కలిగి ఉంటుంది .
• కరక్కాయ విరేచానకారి , లుబ్రికేంట్ , మలబద్దకాన్ని నివారిస్తుంది .

• ఫైల్స్ కి మంచి మందు ,

• ఏస్త్రిన్జేంట్(Astringent) , యాంటి స్పాస్మడిక్(Anti-Spasmodic),యాంటి పైరేతిక్(Anti-pyretic) గా పనిచేస్తుంది .

• పొట్ట ఉబ్బరము , ఎక్కిళ్ళు, వాతులు తగ్గిస్తుంది ,

• జీర్ణ క్రియకు తోడ్పడుతుంది ,

• ఆదుర్దా , నాడీమండల నిస్త్రాణ ను నియంత్రిన్స్తుంది ,

• కంటికి మంచి మందు ,

• కంట స్వరము చక్కబెడుతుంది ,

• కఫా జ్వరాలు నయమవుతాయి ,
ఉపయోగములు :-
1) కరక్కాయ పొడిని మోతాదుకు 3 గ్రా . లు తీసుకొని తేనె తో నిత్యము రెండు పూటల ( ఉదయం , సాయంత్రము ) తీసుకుంటూ , పథ్యము చేస్తు , వుంటే 10 రోజుల్లో పచ్చకామెర్లు ( jaundice) తగ్గిపోతాయి .
2) కరక్కాయ పొడి (ఒక) 1 భాగములో , వేయించిన పిప్పళ్ళ పొడిని ½ (అర) భాగము కలిపి. దాంట్లో నుండి ఒక మోతాదుకు 1 గ్రా పొడిని ని తీసుకొని తేనెతో కలిపి ప్రతి 4 గంటలకి ఒకసారి తీసుకుంటే కోరింత దగ్గు( whooping cough) తగ్గిపోతుంది .
3) భోజనానికి ఒక గంట ముందు కరక్కాయ పొడిని కొచ్చెమ్ బెల్లము తో కలిపి తీసుకుంటే రక్త మొలలు (piles) తగ్గిపోతాయి .
4) కరక్కాయ పొడిని తేనెలో కలిపి తీసుకుంటే విష జ్వరములు తగ్గుతాయి .
5) కరక్కాయ పొడిని ఆముదములో కలిపి ప్రతి రోజు తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి .
6) కరక్కాయ, శొంఠి, తానికాయ, పిప్పళ్లు వీటి చూర్ణాలను సమానంగా కలిపి నిల్వచేసుకొని పూటకు అర టీస్పూన్ చొప్పున మూడుపూటలా తేనెతో గాని లేదా నీళ్ళతో గాని కలిపి తీసుకుంటే దగ్గుతోపాటు ఆయాసం కూడా తగ్గుతుంది.
7) ఎక్కిళ్లు ఇబ్బంది పెడుతున్నప్పుడు కరక్కాయల చూర్ణాన్ని అర చెంచాడు చొప్పున అరకప్పు వేడినీళ్లతో గాని లేదా తేనె, నెయ్యి మిశ్రమంతోగాని కలిపి తీసుకోవాలి.
8) ఆయాసం, ఎక్కిళ్లు సతమతం చేస్తున్నప్పుడు బెల్లం పానకంలో కరక్కాయ ని లేక కరక్కాయ పొడిని వేసి ఉడికించి తీసుకోవాలి.
9) ఎక్కిళ్లు, ఉబ్బసం, దగ్గు, గుండె జబ్బులు కలిసికట్టుగా హింసిస్తున్నప్పుడు వేడిచేసిన పాత నెయ్యిలో కరక్కాయల పెచ్చుల చూర్ణం, ఇంగువ పొడి, బిడాలవణం చేర్చి కలిపి మోతాదుకు అర టీస్పూన్ చొప్పున రెండుపూటలా తీసుకోవాలి
10 ) రక్తహీనతతో బాధపడేవారు కరక్కాలను గోమూత్రంలో నానబెట్టి, తరువాత ఎండబెట్టి, పొడిచేసి, పూటకు అర టీస్పూన్ మోతాదులో రెండు పూటలా అర కప్పు నీళ్లతో కలిపి తీసుకోవాలి.
11) కరక్కాయ చూర్ణం, శొంఠి చూర్ణం, బెల్లం వీటి సమాన భాగాలను కలిపి నిల్వచేసుకొని మోతాదుకు టీస్పూన్ చొప్పున చప్పరించి నీళ్లు తాగాలి. దీంతో మలబద్ధకం తగ్గుతుంది. మలంతోపాటు జిగురు పడటం ఆగుతుంది. ముఖ్యంగా శరీరంలో నీరు పట్టడం తగ్గుతుంది.
12) కఫదోషంవల్ల శరీరంలో వాపుతయారైనప్పుడు కరక్కాయలను గోమూత్రంలో నానబెట్టి, పొడిచేసి పూటకు 3గ్రాముల మోతాదుగా అర కప్పు వేడినీళ్లతో కలిపి తీసుకోవాలి
13) కరక్కాయల చూర్ణం, ఇప్ప పువ్వు, పిప్పళ్లు చూర్ణం మూడూ కలిపి పూటకు అరచెంచాడు మోతాదుగా తేనె చేర్చి వేడినీళ్లతో సహా రెండుపూటలా తీసుకుంటే శరీరంలో తయారైన వాపు తగ్గుతుంది.
14) కరక్కాయ చూర్ణం, శొంఠి చూర్ణం, దేవదారు చూర్ణం మూడు సమభాగాలు కలిపి పూటకు అర టీ స్పూన్ మోతాదుగా, వేడినీళ్లతో రెండుపూటలా తీసుకుంటే శరీరంలో చేరిన నీరు వెళ్లిపోయి వాపు తగ్గుతుంది.
15) కరక్కాయ పిందెల చూర్ణాన్ని 3గ్రాముల మోతాదుగా బెల్లంతో కలిపి అర కప్పు నీళ్లతో తీసుకుంటే శరీరంలో చేరిన వాపు తగ్గుతుంది.

భోజనం విషయంలో ఆయుర్వేదం ఏం చెపుతోంది?

 ఆయుర్వేదం ప్రకారం భోజనం మూడువిధాలుగా తీసుకోవాలని నిర్దేశిస్తుంది. ఆహారం తీసుకునేటప్పుడు జీర్ణ సంబంధ బాధలు లేకుండా ఉండాలంటే మూడు ముఖ్యమయిన నియమాలను పాటించాలని ఆయుర్వేదం చెపుతుంది.
వాటిలో మొదటిది హితభుక్త.... శరీరానికి మేలు చేసే ఆహారం సుళువుగా జీర్ణమయ్యేదానిని హితభుక్తగా నిర్దేశించింది.
మితభుక్త... అవసరం మేరకు తినడం, అధికంగా తినకపోవడం, ఎక్కువసార్లు తినకపోవడం, సమయపాలన, ఎక్కువ పదార్థాలు తినకపోవడాన్ని మితభుక్త.
ఋతుభుక్త... ఆయా ఋతువుల్లో లభ్యమయ్యే ఆహారం తప్పనిసరిగా తినడం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రకృతి ప్రసాదించే ఆహారంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం - ఋతుభుక్తగా నిర్దేశించారు. ఈ ప్రకారంగా భోజనం చేస్తుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు.

Friday, June 19, 2015

వంట కోసమే కాదు వంటి కోసం కూడా....ఇంగువ!!!

 సీజన్ మారింది.. ఈ సీజన్ లో చాలా మందికి తలనొప్పి వస్తుంటుంది… అదీ మైగ్రేన్ అంటే భరించ లేనిది.
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టాలా? అయితే నీటిలో ఇంగువను కరిగించి తీసుకుంటే సరిపోతుందని, ఇలా చేస్తే మైగ్రేన్ తలనొప్పి మాత్రమే గాకుండా సాధారణ తలనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

అలాగే నిమ్మరసం కలిపిన చిన్న ఇంగువ ముక్క పంటి నొప్పికి బాగా పనిచేస్తుంది. అజీర్తి మెరుగ్గా పనిచేసే ఇంగువకు కడుపు మంటను తగ్గించే గుణం ఉంది. యాంటిఆక్సిడెంట్ లక్షణాలు ఇంగువలో ఉన్నాయి. చికాకు పెట్టే పేగు వ్యాధి పేగులో వాయువు, అజీర్తి మొదలైన లక్షణాలను తగ్గించడంలో ఇంగువ సహాయం చేస్తుంది.
ఒక అరకప్పు నీటిలో కొన్ని ఇంగువ ముక్కలను కరగించి తీసుకొంటే ఋతుసమస్య నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఇంకా ఇంగువ శ్వాసకోశ వ్యాధులన్ని తగ్గిస్తుంది. తేనె, అల్లం లో ఇంగువను కలిపి తీసుకుంటే దీర్ఘకాల౦గా ఉన్న పొడి దగ్గు, కోరింత దగ్గు, శ్వాస నాళముల వాపు, ఉబ్బసం వంటి శ్వాస సంబంధ వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు.

ఇంగువ నరాలను ఉత్తేజపరచడం ద్వారా మూర్ఛ వంటి నాడీ సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు

ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా…?

 గోరింటాకు ఇష్టపడని మహిళలు చాలా అరుదు. పండుగలైనా.. ఫంక్షలైనా ముందుగా ఆడవారు గోరింటాకుకే ప్రాధాన్యత ఇస్తారు.

ఇప్పుడంటే మార్కెట్లో పౌడర్లు.. కోన్స్ లాంటివి రెడీమేడ్ గా దొరుకుతున్నాయి కానీ.. ఇదివరకటి రోజుల్లో ప్రతి ఇంటి పెరట్లో గోరింటాకు చెట్టు తప్పనిసరిగా ఉండేది.

ఆషాఢంలో గోరింటాకుకు చాలా ప్రత్యేకత ఉంది. ఆషాఢమాసం వచ్చేస్తోంది .. అనగానే ఆడవారి అరచేతులు గోరింటాకుతో అందంగా మెరిసిపోతుంటాయి.

ఈ మాసంలో గోరింటాకు పెట్టుకునే ఆచారం మన సంస్కృతిలో ఉంది. అసలు దీని వెనుక ఉన్న మర్మమేంటో.. మీకు తెలుసా..?

ఆషాఢమాసంతో గ్రీష్మరుతువు పూర్తిగా వెళ్లిపోయి.. వర్షరుతువు ప్రారంభమౌతుంది.

గ్రీష్మంలో మన శరీరంలో బాగా వేడి పెరుగుతుంది. ఆషాఢంలో బయట వాతావరణం చల్లబడిపోతుంది.. మన శరీరంలో ఉన్న వేడి.. బయట చల్లబడిన వాతావరణం పరస్పర విరుద్ధం కాబట్టి అనారోగ్యాలు మొదలౌతాయి.
గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తీసే శక్తి ఉంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

అందువల్లే మన ప్రాచీనులు గోరింటాకు ఆషాఢమాసంలో తప్పకుండా పెట్టుకోవాలని చెబుతారు.
మహిళలు.. ఈ ఆషాడంలో అందంతో పాటు..ఆరోగ్యాన్నిచ్చే గోరింటను మీ
అరచేతుల నిండా నింపుకోండి...........

Saturday, May 30, 2015

విశిష్ట పురస్కారం " భారత రత్న " గురించి

భారతరత్న పురస్కారం భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. ఇది జనవరి 2, 1954 లో భారతదేశ మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ చేత స్థాపించబడింది. ఈ పౌర పురస్కారం కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషికి ప్రదానం చేస్తారు. ఇప్పటివరకు నలభై మందికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. వారిలో ఇద్దరు విదేశీయులు కూడ ఉన్నారు. ఈ పురస్కారం 13 జులై 1977 నుండి 26 జనవరి 1980 వరకు జనతా పార్టీ పాలనలో కొద్దికాలం పాటు నిలిపివేయబడింది. మరియు ఒకే ఒక్కసారి 1992లో సుభాష్ చంద్రబోస్ కు ఇవ్వబడిన పురస్కారం చట్టబద్ధ సాంకేతిక కారణాల వల్ల వెనుకకు తీసుకొనబడింది.
ఎలాంటి జాతి, ఉద్యోగం,స్థాయి లేదా స్త్రీ పురుష వ్యత్యాసం లేకుండా ఈ పురస్కారం ఇవ్వబడుతుంది. ఈ పురస్కారగ్రహీతల జాబితాను ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫారసు చేయవలసి ఉంటుంది.
భారతరత్న పొందిన పౌరులకు 7వ స్థాయి గౌరవం లభిస్తుంది (మొదటిది ఆరూ- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్లు, మాజీ రాష్ట్రపతులు, ఉపప్రధాన మంత్రి, ముఖ్య న్యాయాధీశులు). కానీ ఈ గౌరవం వలన ఎలాంటీ అధికారాలు లేదా పేరు ముందు ప్రత్యేక బిరుదులూ రావు.
ఈ పురస్కారం పొందిన విదేశీయుల జాబితాలో సరిహద్దు గాంధి గా పేరుపొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (1987) మరియు నెల్సన్ మండేలా (1990) ఉన్నారు.
భారతరత్న పురస్కారం పొందిన వారి జాబితా
పేరు సంవత్సరం
సర్వేపల్లి రాధాకృష్ణన్ (1888-1975) 1954
చక్రవర్తుల రాజగోపాలాచారి (1878-1972) 1954
డా.సి.వి.రామన్ (1888-1970) 1954
డా. భగవాన్ దాస్ (1869-1958) 1955
డా. మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1861-1962) 1955
జవహర్ లాల్ నెహ్రూ (1889 -1964) 1955
గోవింద్ వల్లభ్ పంత్ (1887-1961) 1957
ధొండొ కేశవ కార్వే (1858-1962) 1958
డా. బీ.సీ.రాయ్ (1882-1962) 1961
పురుషోత్తమ దాస్ టాండన్ (1882-1962) 1961
రాజేంద్ర ప్రసాద్ (1884-1963) 1962
డా. జాకీర్ హుస్సేన్(1897-1969) 1963
పాండురంగ వామన్ కానే (1880-1972) 1963
లాల్ బహదూర్ శాస్త్రి (మరణానంతరం) (1904-1966) 1966
ఇందిరాగాంధీ (1917-1984) 1971
వీ.వీ.గిరి (1894-1980) 1975
కే.కామరాజు (మరణానంతరం) (1903-1975) 1976
మదర్ థెరీసా (1910-1997) 1980
ఆచార్య వినోబా భావే (మరణానంతరం) (1895-1982) 1983
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (1890-1988) 1987
యం.జి.రామచంద్రన్ (మరణానంతరం) (1917-1987) 1988
బి.ఆర్.అంబేద్కర్ (మరణానంతరం) (1891-1956) 1990
నెల్సన్ మండేలా (జ. 1918) 1990
రాజీవ్ గాంధీ (మరణానంతరం) (1944-1991) 1991
సర్దార్ వల్లభాయి పటేల్ (మరణానంతరం) (1875-1950) 1991
మొరార్జీ దేశాయి (1896-1995) 1991
మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ (మరణానంతరం) (1888-1958) 1992
జే.ఆర్.డీ.టాటా (1904-1993) 1992
సత్యజిత్ రే (1922-1992) 1992
సుభాష్ చంద్ర బోస్ (1897-1945) (తరువాత ఉపసంహరించబడినది) 1992
ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (జ. 1931) 1997
గుర్జారీలాల్ నందా (1898-1998) 1997
అరుణా అసఫ్ అలీ (మరణానంతరం) (1906-1995) 1997
ఎం.ఎస్.సుబ్బలక్ష్మి (1916-2004) 1998
సి.సుబ్రమణ్యం (1910-2000) 1998
జయప్రకాశ్ నారాయణ్ (1902-1979) 1998
రవి శంకర్ (జ. 1920) 1999
అమర్త్య సేన్ (జ. 1933) 1999
గోపీనాథ్ బొర్దొలాయి (జ. 1927) 1999
లతా మంగేష్కర్ (జ. 1929) 2001
బిస్మిల్లా ఖాన్ (జ 1916) 2001
భీమ్ సేన్ జోషి (జ. 1922) 2008
సచిన్ టెండూల్కర్ 2014
సి. ఎన్. ఆర్. రావు 2014
మదన్ మోహన్ మాలవ్యా 2015
అటల్ బిహారీ వాజపేయి 2015

చక్కటి ఆరోగ్యానికి చిట్కాలు

• అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
• కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
• నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
• గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
• అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.
• జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.
• బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.
• సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
• మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.
• దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.
• ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.
• అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.
• కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.
• మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.
• ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.
• బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.
• క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
• మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.
• ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.
• అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.
• పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.
• సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.
• దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.
• ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.
• చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
• కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.
• క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.
• యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.
• వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.
• పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.
• ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.
• ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
• ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.
• జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
• ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.
• నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
• మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.
• మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.

Saturday, April 25, 2015

ఉల్లికాడలలో ఆరోగ్య ప్రయోజనాలు

గుండెకు మంచిది : ఉల్లికాడలు గుండె, రక్తనాళాలకు మంచిది. ఇది కొలెస్ట్రాల్ ఆక్సీకరణను తగ్గిస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బ్లడ్ ప్రెజర్ ని మెరుగుపరుస్తుంది : ఈ కూరగాయలోని సల్ఫర్ కాంపౌండ్ బ్లడ్ ప్రెజర్ స్థాయిలను నియంత్రి౦చడానికి, తగ్గించడానికి సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్ స్థాయిలు : ఉల్లికాడలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి.

మధుమేహం : ఉల్లికాడలలో ఉన్న క్రోమియం కంటెంట్ మధుమేహ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది, గ్లూకోస్ శక్తిని పెంచుతుంది. అల్లిల్ ప్రోపిల్ డిసల్ఫయిడ్ తగ్గిన బ్లడ్ షుగర్ స్థాయిలలో చాలా సహాయకారిగా కూడా ఉంటుంది.

జలుబు, జ్వరం : దీనిలో ఉన్న యాంటీ-బాక్టీరియల్ లక్షణం జలుబు, జ్వరానికి వ్యతిరేకంగా పోరాడడానికి సహాయపడుతుంది.

అరుగుదల పెరుగుతుంది : అసౌకర్య అరుగుదల నుండి ఉపశమనానికి యాంటి బాక్టీరియల్ లక్షణాలను కూడా అందిస్తుంది.

వ్యాధినిరోధక శక్తి : ఈ కూరగాయలోని విటమిన్ C వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.

పెద్దప్రేగు కాన్సర్ : ఉల్లికాడలలో పెక్టిన్ (నీటిలో కరిగే కొల్లాయిడల్ కార్బోహైడ్రేట్) ముఖ్యంగా పెద్దప్రేగు కాన్సర్ అభివృద్ది అవకాశాలను తగ్గిస్తుంది.

కీళ్ళనొప్పులు, ఉబ్బసం : ఉల్లికాడలలో క్వర్సేటిన్ బాధనివారక, యాంటి హిస్టమైన్ ప్రయోజనాలను అందిస్తుంది. ఇది కీళ్ళనొప్పులు, ఉబ్బస చికిత్సకు మంచి కూరగాయ.

జీవక్రియ : స్ధూలపోషకాలు ఉండడం వల్ల ఇది జీవక్రియ నియంత్రణకు మంచి ఆహారం.

కళ్ళు :
ఉల్లికాడలు కళ్ళ జబ్బులకు, కాళ్ళ సమస్యలకు మంచివి.

ముడతలను తొలగిస్తుంది : కూరగాయలలోని అల్లసిన్ చర్మానికి మంచిది, ఇది చర్మం ముడతల నుండి రక్షిస్తుంది

తేనె సహజ ఔషధ గుణములు

  • తేనే సూక్ష్మజీవుల సంహారిణి, బ్యాక్టీరియా, ఈస్ట్ ‌‌, మోల్ట్స్  వంటి వాటిని ఎదగనివ్వదు.
  • ఇందులోని కార్బోహైడ్రేట్‌లు తక్షణ శక్తిని ఇస్తాయి.
  • చిన్న చిన్న గా యాలు, చర్మ ఇబ్బందులు తేనే విరుగుడుగా పనిచేస్తుంది.
  • గొంతులో గరగరలను తగ్గిస్తుంది. .  నిమ్మ రసము తో కలిపి దగ్గు , గొంతు నొప్పులకు బాగా పనిచేయును ,
  • తేనేలో కార్బోహైడ్రేట్‌లు, నీరు, మినరల్‌‌స , విటమిన్‌‌స వుంటాయి. కాల్షియమ్‌, మాంగనీస్‌, పోటాషియమ్‌,ఫాస్ఫరస్‌, జింక్‌, విటమిన్‌ ఎ, బి,సి,డి తేనేలో లభిస్తాయి.
  • తేనేను క్రమం తప్పకుండా తీసుకుంటే దాదాపు వంద రకాల అనారోగ్యాలను అడ్డుకుంటుందని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది.
  • కీళ్ళనోప్పులు బాధిస్తుంటే ఒక వంతు తేనే, రెండు వంతుల నీరు, ఒక చెంచా దాల్చిన చెక్క పోడి తీసుకొండి. ఆమిశ్రమాన్ని కలిపి ముద్ద చేసి బాధిం చే భాగం మీద మర్ధన చేస్తే మర్ధన చేసిన రెండు మూడు నిమిషాలలోనే ఉపశమనం కలుగుతుంది.
  • రెండు స్పూన్ల తేనేలో దాల్చిన చెక్క పొడి కలుపుకుని ఆహారం తీసుకునే ముందు తీసుకుంటే ఎసిడిటీ బాధ తొలిగి, జీర్ణం సులభం చేస్తుంది.
  • తేనే ,దాల్చిన చెక్క పొడిని బ్రెడ్‌ మీద పరుచుకుని తింటే కొలెస్టరాల్‌ తగ్గుతుంది.
  • రోజుకు మూడు పూటలా తీసుకుంటే క్యాన్సర్‌ రానివ్వదు.
  • వేడినీటిలో ఒక స్పూన్‌ తేనే, దాల్చిన చెక్క పొడి వేసి ఆ నీటితో కొద్దిసేపు పుక్కిలించి ఉమ్మేస్తే నోటి దుర్వాసన సమస్య మాయవుతుంది.
  •     తేనే లో ఉన్నా విటమిన్స్... శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిన్చును,   
  •     యాన్తి బ్యాక్తెరియాల్ , యాన్తి సెప్టిక్ గునాలున్నందున చర్మము పై పూసిన ,.. గాయాలు మానును .
  •     తేనే ... వెనిగర్ తో కలిపి 'vermifuge ' గా వాడుదురు .
  •     రోజూ 1/4 గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో రెండు చెంచాల తేనే కలుపుకు త్రాగితే ఒళ్ళు తగ్గుతుంది .
  •     రాత్రిళ్ళు పాలు తేనే కలుపుకొనే త్రాగితే చక్కటి నిద్ర వస్తూన్ది .
  •     నిమం రసం లో తేనే కలుపుకొని తీసుకుంటే కడుపు ఉబ్బరం , ఆయాసము తగ్గుతుంది .
  •     తేనే లో కొచెం మిరియాలపొడి కలుపుకొని తీసుకుంటే జలుబు తగ్గుతుంది .
  •     రెండు చెంచాల తేనే లో కోడిగుడ్డు లోని తెల్లనిసోన , కొంచం శనగపిండి కలుపుకొని ముఖంనికి మర్దన చేసుకుంటే చర్మపు కాంతి పెరుగుతుంది .
  •     తేనే లో పసుపు , వేపాకు పొడి కలిపి రాస్తే పుల్లు మానుతాయి .
Source: http://food-health-disease.blogspot.in

అలసటను దూరము చేసే ఆహారము :

శారీరకముగా , మానసికముగా బాగా శ్రమచేసినప్పుడు అలసట అనిపిస్తుంది.అలుపు , మత్తు , నిద్రమత్తు , నిస్సతువ లాంటివన్నిటినీ  అలసటగా పేర్కొంటారు . అలసట కలగడానికి శారీరకంగా లేదా మానసికంగా శ్రమ కారణమవుతుంది.మన ఆరోగ్యము పట్ల శ్రద్దచూపినట్లైతే శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు ఏమిటో మనము తెలుసుకోవాలి . సరైన పోషకాలు శరీరానికి అందనప్పుడు కూడా అలసట అనిపిస్తుంది.

అలసటను అధికమించడానికి అవసరమైయ్యే ఆహారపదార్ధాలు - అలవాట్లు :

టిఫిన్‌ తప్పనిసరి -- ఉదయాన్నే కడుపు ఖాలీ గా ఉండడము వలన మనము తప్పనిసరిగా శక్తినిచ్చే గ్లూకోజ , పోషకాలు , కార్బోహైడ్రేట్స్ ఉంటే టిఫిన్‌ తినాలి .

లంచ్ లో ఉండాల్సినవి : మధ్యాహ్నం పూట శక్తి , చురుకుదనము కోసము కార్బోహడ్రేట్సు , ప్రోటీన్లు వున్న ఆహారము తీసుకోవాలి. చురుకుదనాన్ని , మానసిక కేంద్రీకరణను పెంచే న్యూరోట్రాన్సుమీటర్ల కోసము పోటీన్లు పుష్కరముగా లభించే ఆహారము తప్పనిసరిగా తీసుకోవాలి .

ఎక్కువ నీరు త్రాగాలి : శరీరములో తగినంత నీరు లేకపోతే పని సామర్ధ్యము తగ్గిపోతుంది. శరీరము లో నీరు తగ్గిపోవడము వల్ల అన్ని అవయవాలకు రక్తప్రసరణ తగ్గిపోయి మెదడు పనితనము నెమ్మదిస్తుంది. అందువల్ల ప్రతిరోజూ 8 గ్లాసులు (1600 -2000 మిల్లీలీటర్ల ) నీరు తాగాలి. దప్పిక అయ్యేవరకు ఆగకూడదు.

ఉపవాసాలు , విందులు వద్దు : బోలెడన్ని పదార్ధాలతో మితిమీరి కేలరీలు అభించే ఆహారము తీసుకోవద్దు .దీనివలన తీవ్రమైన ఆరోగ్యసమస్యలకు దారితీస్తుంది. వయసు , స్త్రీ-పురుష బేధము , బరువు , చేసేపని ... ఆధారముగా పోషకవిలువలు గల ఆహారము అవసరము . బోజనము మానివేయవద్దు . మానేస్తే రక్తము లో చెక్కెర శాతము తగ్గి అలసట వస్తుంది. శరీరానికి కావసైన శక్తినిచ్చే తగినన్ని కార్బోహడ్రేట్స్ లేని రకరకాల ఆకర్షనీయమైన చిరుతిండ్లు పనికిరావు . . . వీటిలో విటమిన్లు ఉండవు . పోషకవిలువలు లేని ఆహారపదార్దములు అలసటకు దారితీస్తాయి.

ఐరన్‌ ఎక్కువగా ఉంటే మేలు : శరీరములోని వివిధ అవయవాలకు రక్తము ద్వారా ఆక్షిజన్‌ బాగా సరఫరా కావడానికి ఐరన్‌ దోహదము చేస్తుంది.ఐరన్‌ శరీరానికి సరిపడినంత లభించకపోతే అలసటకు దానితీస్తుంది. ఒకవేళ రక్తహీనత లేకపోయినా ఐరన్‌ శాతము తక్కువగా ఉన్నట్లైతే అలసటకు , మనోవ్యాకులతకు దారితీస్తుంది.

కెఫిన్‌ తో జాగ్రత్త : రోజులో కెఫిన్‌ వున్న కాఫీ , టీ , కోలా లాంటి డ్రింక్సు ఒకటి .. రెండు సాలు తాగినట్లయితే శరీరములో శక్తి పెరుగుతుంది . చురుకుదనము వస్తుంది . అలా కాకుండా రోజులో 5-6 సార్లు మించి కెఫినేటెడ్  ద్రవపదార్ధాలు తీసుకున్నట్లయితే అది ఆందోళనకు , చికాకు కలగడానికి , శారీరక సామర్ధ్యము తగ్గిపోవడానికి దారితీస్తుంది.

యోగర్ట్ : దీర్ఘకాలికంగా అలసటకు గురవడానికి ముఖ్యకారణము జీర్ణక్రయ జరిగే మార్గములో మైక్రో-ఆర్గానిజమ్స్ అసమతుల్యముగా ఉండడమే. రోజులో 200 మి.లీ. యోగర్ట్ (పెరుగు/మజ్జిక ) రెండు సార్లు తీసుకుంటే అలసట లక్షణాలు తగ్గుతాయి.

విటమిన్‌ సి : యాంటి ఆక్షిడెంట్ గా పనిచేసే విటమిన్‌ ' సి ' ఉన్న ఆహార-పానీయాలు తీసుకుండే శరీరానికి మంచిది , వ్యాదినిరోధక శక్తిని పెంచుతుంది. . రక్తకణాలు తయారీకి , ఫ్రీరాడికల్స్ పారద్రోళి అలసటను తగ్గిస్తుంది. శరీరానికి అన్ని విటమిన్లు అవసరమే అందుకే మల్టీవిటమున్‌ మాత్రలు రోజూ ఒకటి డాక్టర్ల సలహా తో తీసుకోవాలి .

Source: http://food-health-disease.blogspot.in

ఉలవలు - Horse gram

రపంచములో అత్యంత ప్రాచీన ధాన్యము ఉలవలు . దక్షిణాదిలో నూ , ఉత్తరాది కొన్ని గ్రామాలలోనూ ఇప్పటికీ ఇది పాపుల పంట .ఉలవలలో పోటీన్లు , ఐరన్‌ , కార్భోహైడ్రేట్స్ , కాల్సియం , ఫాస్పరస్ , ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. చెక్కెర స్థాయిలను క్రమబద్దీకరించడములోనూ , రక్తపోటు నియంత్రించడములోనూ ఉలవలు ఉపకరిస్తాయి.

ఉలవలు:- Dolichos Uniflorus, Dolichos Biflorus. Eng. Horse gram. సం. కుళుత్ధ, తామ్రబీజ, హిం. కుల్తీ. ఇవి తెలుపు ఎరుపు, నలుపు రంగులుగల మూడు జాతులుగ నుండును. ఉలవలు నవధాన్యాలలో ఒకటి.

 ఉలవయొక్క కషాయము గాని లేక చూర్ణము గాని, వగరుగ, తీపిగ స్వాదుగనుండును. మూలవ్యాధి, మూత్రకృఛ్రము, ఊపిరిగొట్టునొప్పి, మలబద్ధము వీనిని హరించును; కఫమును లేక శ్లేష్మమును కరిగించును అనగా నీరుజేయును; స్త్రీలు బహిష్టు కావడములోని లోపములను (menstural disorders)పోగొట్టును; ప్రసవ స్త్రీల మైలరక్తమును వెడలించును. గురదాల లోని రాతిని కరిగించును;ఆకలి బుట్టించును; ఎక్కిళ్ళు, నేత్రరోగములు  నణచును;

*ఉలవల్లో ప్రోటీన్ ఎక్కువ. పెరిగే పిల్లలకు మంచి టానిక్. ఉలవల్లో ఐరన్, మాలిబ్డినం వంటి ఖనిజ సంబంధ పదార్థాలూ ఎక్కువే. పొట్టు తొలగించటం, మొలకెత్తించటం, ఉడికించటం, వేయించటం వంటివి చేయడం ద్వారా ఉలవల్లోని పోషకతత్వాలు గణనీయంగా పెరుగుతాయి.
* ఉలవలు ఆకలిని పెంచుతాయి. కఫాన్ని పల్చగా మార్చి వెలుపలకు తెస్తాయి. కళ్లు కన్నీరు కారటం, కళ్లలో పుసులు కట్టడం వంటి సమస్యల్లో వాడవచ్చు.
* మూత్రాశయంలో తయారయ్యే రాళ్లను కరిగించి వెలుపలకు రావడానికి ఉలవలు సహకరిస్తాయి. తరచూ ఎక్కిళ్లు వస్తుంటే ఉలవలు తగ్గిస్తాయి.
* ఉలవలను తీసుకోవటంవల్ల మలనిర్హరణ సజావుగా, సాఫీగా జరుగుతుంది. ఉలవలను ఆహారంలో వాడేవారికి మూత్ర విసర్జన ధారాళంగా, నిరాటంకంగా జరుగుతుంది. మహిళల్లో బహిష్టురక్తం కష్టం లేకుండా విడుదలవుతుంది. ఉలవలు ప్లీహ వ్యాధులతో బాధపడేవారికి సైతం హితం చేస్తాయి.
* ఉలవలను ఆహార రూపంలో తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది. ముందుగా ఒక కప్పు ఉలవలకు నాలుగుకప్పులు నీళ్లు కలిపి కుక్కర్‌లో ఉడికించాలి. ఇలా తయారుచేసుకున్న ‘ఉలవకట్టు’ను ప్రతిరోజూ ఉదయంపూట ఖాళీ కడుపుతో, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు. *ఉలవలు తీసుకునే సమయంలో శరీరంలో మంటగా అనిపిస్తుంటే మజ్జిగ తాగితే సరిపోతుంది.
*బోదకాలు, కాళ్లవాపు- ఉలవల పిండినీ, పుట్టమన్నునూ ఒక్కోటి పిడికెడు చొప్పున తీసుకొని సమంగా కలపాలి. దీనికి కోడిగుడ్డు తెల్లసొనను కలిపి స్థానికంగా లేపనంచేస్తే హితకరంగా ఉంటుంది.
*లైంగిక స్తబ్ధత: ఉలవలను, కొత్త బియ్యాన్నీ సమంగా తీసుకొని జావమాదిరిగా తయారుచేయాలి. దీనిని పాలతో కలిపి కొన్ని వారాలపాటు క్రమంతప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తి, శృంగారానురక్తి పెరుగుతాయి. దీనిని వాడే సమయంలో మలబద్ధకం లేకుండా చూసుకోవాలి.
*కాళ్లు, చేతుల్లో వాపులు, నొప్పి: ఉలవలను ఒక పిడికెడు తీసుకొని పెనంమీద వేయించి మందపాటి గుడ్డలో మూటకట్టి నొప్పిగా ఉన్న భాగంలో కాపడం పెట్టుకోవాలి. శరీరంలో వ్రణాలు (అల్సర్లు) తయారవటం: పావు కప్పు ఉలవలను, చిటికెడు పొంగించిన ఇంగువను, పావు టీస్పూన్ అల్లం ముద్దను, పాపు టీ స్పూన్ అతిమధురం వేరు చూర్ణాన్నీ తగినంత నీటిని కలిపి ఉడికించాలి. దీనికి తేనె కలిపి కనీసం నెలరోజులపాటు తీసుకుంటే బాహ్యంగా, అభ్యంతరంగా తయారైన వ్రణాలు (అల్సర్లు) త్వరితగతిన తగ్గుతాయి.
*మూత్రంలో చురుకు, మంట:ఒక కప్పు ఉలవచారుకి సమాన భాగం కొబ్బరి నీరు కలిపి తీసుకుంటుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. మూత్రం జారీ అవుతుంది. మధుమేహం: మూత్రంలో చక్కెర కనిపిస్తున్నప్పుడు ఉలవల కషాయంలో వెంపరి (శరపుంఖ) చెట్టు చూర్ణాన్ని, సైంధవ లవణాన్ని కలిపి తీసుకుంటే లాభదాయకంగా ఉంటుంది.
*సెగగడ్డలు: ఉలవ ఆకులను మెత్తగా నూరి, కొద్దిగా పసుపుపొడి కలిపి పై పూత మందుగా రాస్తే చర్మంమీద తయారైన సెగ గడ్డలు పగిలి, నొప్పి, అసౌకర్యం తగ్గుతాయి.

మూలము : వికీపెడియా .

బడి పిల్లల ఆహారం విషయంలో జాగ్రత్తలు

ఆహారంలో విటమిన్లు, ప్రొటీన్లు, కొవ్వు, పిండి పదార్ధాల్లాంటివి అన్నీ ఉన్నాయా? లేదా? చూసుకోవాలి. బడి పిల్లల ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకుంటే...వారి ఆరోగ్యం బాగుంటుంది...చదువూ సాఫీగా సాగుతుంది.

ప్రొటీన్స్‌, కార్భోహైడ్రెడ్స్‌...
విద్యార్ధుల్లో శరీర పెరుగుదలకు ప్రొటీన్స్‌ ఎంతో ముఖ్యమైనవి. రోగ నిరోధక శక్తిని కూడా ప్రొటీన్స్‌ పెంచుతాయి. గాయాలు తగిలినా ప్రొటీన్స్‌ ఎక్కువగా ఉండడం వలన త్వరగా తగ్గుతాయి. కోడిగుడ్లు, పప్పు దినుసులు, మొలకెత్తే విత్తనాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇక కార్భోహైడ్రెడ్స్‌ అంటే పిండి పదార్ధాలు. ఇవి శక్తినిస్తాయి. జీవనశైలికి శక్తి ఎంతో అవసరం. పిండి పదార్ధాలు విద్యార్ధులకు గ్లూకోజ్‌లా పనిచేస్తాయి. చిరు ధాన్యాలు, బియ్యం, గోధుమలు, రాగులు తదితర వాటి వల్ల ఇవి సమృద్దిగా లభిస్తాయి.

కొవ్వు పదార్ధాలు...
కొవ్వు పదార్ధాలతో విద్యార్ధులకు ఎంతో మేలు జరుగుతుంది. శరీరంతో పాటు లోపల ముఖ్య భాగాలైన మూత్రపిండాలు, గుండె లాంటి వాటికి రక్షణ కవచాల్లా ఉంటాయి. కొవ్వు పదార్ధాలు తక్కువగా ఉన్నవారు వాతావరణంలో మార్పులు తట్టుకోలేకపోతారు. మాంసం, వెన్నె, నెయ్యి, పాలు, పల్లి నూనె, గింజలు తీసిన వంట నూనె శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కొవ్వు పెరిగి అది ఎముకలకు రక్షణగా నిలుస్తుంది.

గుడ్డు...
కోడి గుడ్డు పిల్లలకు ఎంతో ఆరోగ్య ప్రదాయిని. రోజుకు ఒక గుడ్డు చొప్పున కోడిగుడ్డు తినిపిస్తే వారి ఆరోగ్యానికి భరోసా లభించినట్లు అవుతుంది. కోడి గుడ్డులోని నీలం తినిపిస్తే పిల్లలకు కొవ్వు లభిస్తుంది. వంద శాతం పౌష్టికాహారం లభించేది గుడ్డులోనే అనే విషయం చాలా మందికి తెలియదు. 11రకాల ఆవ్లూలు గుడ్డులోనే లభిస్తాయి.

మినరల్స్‌...
మినరల్‌ తక్కువగా ఉండడంతో విద్యార్ధుల్లో ఎముకలు, దంతాల పెరుగుదల నిలిచిపోతుంది. రక్తస్రావం త్వరగా అదుపులోకి రాదు. నాడీ వ్యవస్థలో చైతన్యం కొల్పోతుంది. కండరాలు పని చేయవు. జీవక్రియ మెతకబడుతుంది. అలాగే ఐరన్‌ను రక్తంలో ఉండే ధాతువులు తక్కువ అయినా ప్రమాదమే. రక్తంను ఆక్సిజన్‌తో వివిధ భాగాలకు చేరవేయడానికి ఐరన్‌ కీలక భూమిక పోషిస్తుంది. శారీరక, మానసిక స్థిరత్వానికి మాంసం, కోడిగుడ్లు, చేపలు, పాలు, కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, రాగులు, కర్జూరా, బాదం, ఖాజు బాగా తినిపించాలి.

అయోడిన్‌...

అయోడిన్‌ లోపిస్తే అనారోగ్యం తప్పదు. థైరాయిడ్‌ హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. అయోడిన్‌ తక్కువ అయితే జ్ఞాపక శక్తి తగ్గుతుంది. దీనితో విద్యార్ధులు చదువుతున్నప్పటికి వాటిని గుర్తుంచుకోలేకపోతారు. జింక్‌ కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి పిల్లలకు చేపలు, రొయ్యలు, పండ్లు, కూరగాయలతో పాటు బాగా తినిపించాలి. ప్రభుత్వం కూడా అయోడిన్‌, ఐరన్‌ కలసిన ఉప్పును మార్కెట్‌లో లభిస్తుంది.

మొలకెత్తిన విత్తనాలు...
మొలకెత్తిన విత్తనాలు తినడం ఎంతో మంచిది. వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పెసర్లు, శెనగలు, రాగులు, బబ్బర్లు, పల్లిdలు, కర్జూరా. వీటిని రాత్రి తడిగుడ్డలో చుట్టి ఉంచాలి. తెల్లవారేసారికి మొలకలు వస్తాయి. వాటిని ప్రతి రోజు పిల్లలకు తినిపించాలి. విటమిన్లు, పోషక పదార్ధాలు లభిస్తాయి. మార్కెట్లోనూ దొరుకుతాయి.

పిల్లలపై ప్రభావం:
- ప్రొటీన్లు, కొవ్వు పదార్ధాలు, పిండి పదార్ధాలు, విటమిన్ల లోపంతో విద్యార్ధులపై అనేక ప్రభావం చూపుతుంది.
- విద్యార్ధుల్లో తొందరగా అలసట రావడం.
- చదువులో వెనకబడడం.
- జ్ఞాపకశక్తి తగ్గడం.
- రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది.
- వ్యాధులు ఎప్పుడు వస్తాయి.
- దృష్టి లోపాలు వస్తాయి.
- దంతాలు, ఎముకల సమస్యలు.
- పుస్తకాల బ్యాగులు మోయలేకపోవడం.
- చురుగ్గా ఉండకపోవడం.
- క్రీడలపై నిరాసక్తి.

Source: http://food-health-disease.blogspot.in

గ్రీన్ ఆపిల్: ఆరోగ్య ప్రయోజనాలు

రోజుకు ఒక ఆపిల్ తింటే వైద్యుడి అవసరం ఉండదు" అని ఒక సామెత ఉన్నది. అయితే ఖచ్చితంగా ఆకుపచ్చ ఆపిల్ లో ఈ వాస్తవం కలిగి ఉంది. ఆపిల్ అనేది మనకు ప్రకృతి ప్రసాదించిన వరం. అత్యంత అసాధారణ మరియు అద్భుతమైన పండ్లలో ఒకటిగా ఉన్నది. ప్రతి వ్యక్తి తమ రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. దీనిలో అవసరమైన పోషకాలు మరియు చాలా విటమిన్లు ఉంటాయి. ఆపిల్స్ లో చాల రకాలు ఉన్నాయి. సాదారణంగా ఎరుపు మరియు ఆకుపచ్చ ఆపిల్స్ పుల్లని మరియు తియ్యటి రుచిని కలిగి ఉంటాయి.  గ్రీన్ యాపిల్ దీర్ఘ కాల ఆరోగ్యవంతమైన పండ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది అంతర్లీన ప్రోటీన్లు, విటమిన్లు,ఖనిజాలు మరియు ఫైబర్ వంటి అవసరమైన పోషకాలను కలిగి ఉంటుంది. జీర్ణవ్యవస్థ లోపాలు నుండి ఉపశమనం మరియు రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించటం,BP తగ్గించడం,రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడం & ఆకలి మెరుగుపరచడం వంటి వాటికీ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.

సూపర్ మర్కెట్ లో నేడు ప్రత్యేకం గా కనిపిస్తున్న పండ్లలో ఒకటి " గ్రీన్‌ యాపిల్ " సాధారణ యాపిల్ పండు రంగుకు భిన్నం గా కనిపించే  ఈ యాపిల్ పండును చూసిన చాలా మంది అది పచ్చి యాపిల్ గా భావించే అవకాశముంది. అయితే ఈ పచ్చ యాపిల్ పండుకు మన దేశములో లభించే యాపిల్ పండుకు సంబంధములేదు. లేత ఆకుపచ్చ రంగులో నిగనిగ లాడుతూ కనిపించే ఈ గ్రీన్‌ యాపిల్ ఆస్ట్రేలియా కు చెందిన యాపిల్ . పండ్ల అన్నింటా అత్యంత అధిక ఆరోగ్యాన్ని అందించే పండు గా దీనిని పేర్కొంటారు. ఇతర యాపిల్ పండుకు దీనికి జన్యుపరంగా అంతగా తేడాలు లేకపోయినా రుచి విషయము లో స్పస్టమైన తేడా ఉంది. సిమ్లా యాపిల్ పండులా గ్రీన్‌ యాపిల్ లో తియ్యదనము ఉండదు. కొంత వగరు రుచి కలిగి ఉంటుంది. ఈ రుచి వల్లనే దానికి ప్రత్యేకత సంతరించుకుందంటారు. . . వ్యాపారులు . సిమ్లా యాపిల్ కు గ్రీన్‌యాపిల్ కు ముఖ్యమైన తేడా దాని రంగు . యాపిల్స్ లో ఎరుపు , గ్రీన్‌ తరహావే కాక పసుపు రంగు యాపిల్స్ కూడా ఉంటాయి. వీటిలో దేని రుచి దానిదే.

గ్రీన్ ఆపిల్: ఆరోగ్య ప్రయోజనాలు

ఎక్కువ ఫైబర్ కంటెంట్ : దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండుట వల్ల జీర్ణవ్యవస్థను శుభ్రపర్చడానికి సహాయపడి తద్వారా జీవక్రియను పెంచుతుంది. అందువలన ఇది స్వేచ్ఛా ప్రేగు కదలికలో సహాయపడుతుంది. ఆపిల్ ను దాని చర్మంతో సహా తినటం ఎల్లప్పుడూ మంచిది. మీ ప్రేగు మరియు వ్యవస్థలను శుభ్రపర్చి మీరు సంతోషముగా మరియు ఆరోగ్యవంతులుగా ఉండటానికి సహయ పడుతుంది.

ఖనిజాల కంటెంట్ : ఇనుము,జింక్,రాగి,మాంగనీస్,పొటాషియం మొదలైన ఖనిజాలను కలిగి ఉంటుంది. మానవ ఆరోగ్యం మరియు శ్రేయస్సు ఖనిజాల మీద ఆదారపడి ఉంటుంది. ఆపిల్ లో ఉన్న ఇనుము రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాక జీవక్రియ రేటు పెంచటానికి సహాయపడుతుంది.

తక్కువ కొవ్వు కంటెంట్ : బరువు తగ్గాలని అనుకొనే వారికీ గొప్ప ఆహారం అని చెప్పవచ్చు. ప్రతి వ్యక్తీ తమ రోజు వారి ఆహారంలో తప్పనిసరిగా ఆపిల్ ఉండేలా చూసుకోవాలి. ఇది రక్తనాళాలలో కొవ్వును సేకరిస్తుంది. అంతేకాక స్ట్రోక్స్ అవకాశాలు నివారించడం,గుండెకు సరైన రక్త ప్రవాహం నిర్వహణలో సహాయపడుతుంది.

చర్మ క్యాన్సర్ నిరోధిస్తుంది : దీనిలో విటమిన్ C ఉండుటవల్ల ఫ్రీ రాడికల్స్ ద్వారా చర్మ కణాలకు వచ్చే నష్టాన్నినిరోధించడంలో సహాయపడుతుంది. అందువలన చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

సమృద్ధిగా యాంటీ ఆక్సిడంట్ : యాంటీ ఆక్సిడంట్ లు కణాల పునర్నిర్మాణం మరియు కణాల పునరుత్తేజం నకు సహాయం చేస్తాయి. ఆరోగ్యకరమైన మరియు ప్రకాశించే చర్మ నిర్వహణలో కూడా సహాయపడతాయి. యాంటీ ఆక్సిడంట్ మీ కాలేయం రక్షించడానికి మరియు దాని యొక్క సరైన కార్యాచరణ నిర్ధారించడానికి సహయపడతాయి.

ఆరోగ్యకరమైన,బలమైన ఎముకలు : ఇది థైరాయిడ్ గ్రంథి సరైన కార్యాచరణకు సహాయం చేయడం ద్వారా కీళ్లవ్యాధులను నిరోధిస్తుంది.

 అల్జీమర్ నిరోధిస్తుంది : ప్రతి రోజు ఒక ఆపిల్ తింటే అల్జీమర్ వంటి వృద్ధాప్య నరాల సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాన్ని అడ్డుకుంటుంది.

ఆస్త్మా నిరోధిస్తుంది : క్రమం తప్పకుండా ఆపిల్ రసం తీసుకుంటే తీవ్ర సున్నితత్వం కలిగిన అలెర్జీ రుగ్మత అయిన ఆస్త్మాని నిరోధించటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

డయాబెటిస్ నిరోధిస్తుంది : యాపిల్స్ మధుమేహంను నిరోధిస్తుంది. ఇది మధుమేహం కోసం తప్పక కలిగి ఉండాలి.సమృద్ధిగా విటమిన్ A,B మరియు C ఫ్రీ రాడికల్స్ హానికరమైన ప్రభావాల నుండి చర్మంను రక్షించటానికి గ్రీన్ ఆపిల్ లో విటమిన్లు A,B మరియు C సమృద్ధిగా ఉంటాయి. అంతేకాక ప్రకాశించే చర్మం నిర్వహించడం కొరకు సహాయపడుతుంది.

మైగ్రేన్‌ తలనొప్పికి విరుగుడు : మహిళల్లో ఒత్తిడి శాతం పెరిగిపోయి అది క్రమంగా మైగ్రేన్‌ తలనొప్పిగా తయారయ్యే ప్రమాదం లేకపోలేదని వెైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు అటువంటి మైగ్రేన్‌ తలనొప్పికి విరుగుడుగా ఆకుప చ్చని యాపిల్స్‌ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటిని తింటే మైగ్రేన్‌ తలనొప్పిని దూరం చేయవచ్చని వెైద్యు లు చెబుతున్నారు.


  •  గ్రీన్ ఆపిల్: స్కిన్ ప్రయోజనాలు :
గ్రీన్ ఆపిల్ ఒక అద్భుతమైన సౌందర్యాన్ని పెంచుతుంది. చర్మ సంరక్షణ మరియు జుట్టు సంరక్షణ ప్రయోజనాలు గ్రీన్ ఆపిల్ తో చాలా సంబంధం కలిగి ఉంటాయి.

  • చర్మ ఛాయను పెంపొందిస్తుంది గ్రీన్ ఆపిల్ లో విటమిన్ కంటెంట్ ఎక్కువగా ఉండుట వల్ల మీ చర్మం నిర్వహణలో సహాయపడుతుంది. మీ ఛాయతో మంచి తెల్లబడటం మరియు పెంచే ప్రభావాలను కలిగి ఉంటుంది. ముఖ్యమైన విటమిన్లు వలన  వివిధ రకాల చర్మవ్యాధులను నిరోధించడంలో సహాయపడుతుంది.
మొటిమలను నివారిస్తుంది గ్రీన్ ఆపిల్ అత్యంత ప్రభావవంతమైన యాంటీ మోటిమలు చికిత్సకు సహయ పడుతుంది. గ్రీన్ ఆపిల్ యొక్క సాధారణ వినియోగం వలన మొటిమలను నిరోధిస్తుంది.

  • కళ్ళ ఆరోగ్యానికి-నల్లటి వలయాలను తగ్గిస్తుంది అదనంగా మీ కళ్ళు రిఫ్రెష్ మరియు డార్క్ వలయాలు తొలగింపునకు సులభతరం చేస్తుంది.
చుండ్రును నివారిస్తుంది: గ్రీన్ ఆపిల్ చర్మం కొరకు మాత్రమే కాకుండా జుట్టు కొరకు కూడా చాలా మంచి ప్రయోజనాలను కలిగి ఉంది.. గ్రీన్ ఆపిల్ ఆకులు మరియు దాని తొక్కతో కలిపి చేసిన పేస్ట్ చుండ్రును పరిష్కరించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఈ పేస్ట్ ను ఒక షాంపూ లాగ వాడాలి. గ్రీన్ ఆపిల్ రసంను కూడా జుట్టు లోకి క్రమం తప్పకుండా మసాజ్ చేస్తే చుండ్రు తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది.
జుట్టు రాలడాన్ని అరకడుతుంది: పటిష్టమైన జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తూ జుట్టు నష్టం నిరోధించడానికి గుర్తించబడిన గొప్ప పరిష్కారం.


  • గ్రీన్ ఆపిల్ ఒక గొప్ప యాంటీ వృద్ధాప్య పదార్ధం. గ్రీన్ ఆపిల్ లో ఉండే యాంటీ ఆక్సిడంట్ మరియు ఫైబర్స్ దీర్ఘకాలం పాటు మీ చర్మంను స్థితిస్థాపక మరియు యవ్వనంగా ఉంచేందుకు సహయ పడతాయి. గ్రీన్ ఆపిల్ ఉపయోగించి మీ ముఖంనకు మాస్క్ వేసుకొంటే మీ చర్మానికి తేమ,మీ చర్మం యొక్క మొత్తం ఆకృతి అభివృద్ధి మరియు ముడుతలు తగ్గటానికి సహాయపడుతుంది.

ఆపిల్‌... ఔషధఫలం

ఆపిల్‌ పోషకాల గురించి మనకు తెలిసిందే. అయితే అందులోని ఔషధగుణాలవల్ల చాలా రకాల వ్యాధుల్ని నివారించవచ్చంటున్నాయి ఈ సరికొత్త పరిశోధనలు...
* రోజూ కనీసం ఓ ఆపిల్‌ తినేవాళ్లలో (తినని వాళ్లతో పోలిస్తే) మధుమేహం కూడా తక్కువే. ఆపిల్‌ని కొందరు తొక్క తీసి తింటారు. కానీ అందులోని ట్రిటర్‌పినాయిడ్లు కాలేయ, పేగు, రొమ్ము క్యాన్సర్ల కణాలు పెరగకుండా అడ్డుపడతాయి.
* ఆపిల్‌ జ్యూస్‌కి ఆల్జీమర్స్‌ని నిరోధించే శక్తి ఉంది. మెదడులోని ఎసిటైల్‌ కోలీన్‌ స్రావాన్ని పెంచడం ద్వారా న్యూరోట్రాన్స్‌మిటర్ల పనితీరుని మెరుగుపరుస్తుంది.

Source: http://food-health-disease.blogspot.in/

చర్మ సౌందర్యానికి ఆహారము

కొన్ని ఆహారపదార్థాలు వయసు కనిపించనీయకుండా చర్మం మెరిసేలా చేస్తాయి. సాధారణంగా  మనం తీసుకునే ఆహారమే మన అందాన్ని, ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. మన శరీరానికి రక్షణ కవచమైన చర్మం మన ఆరోగ్య స్థితిని చెప్పకనే చెబుతుంది. పుట్టిన నాటి నుంచి మన శరీరంతో పాటు చర్మంలో కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. చిన్నపిల్లలప్పుడు లేత చర్మం పెద్దవాళ్లయ్యేప్పటికి పూర్తిగా మారిపోతుంది. ఇది ప్రకృతి సహజంగా జరిగే మార్పే అయినా సరైన ఆహారం, చక్కటి జీవనశైలి ద్వారా వృద్ధాప్యపు జాడలని మన దరికి చేరనీయకుండా చర్మాన్ని కాపాడుకోవచ్చు.

ముట్టుకుంటే గరుగ్గా... చూడటానికి కాంతిహీనంగా కనిపించే చర్మం సరైన పోషణ, సంరక్షణ లోపాన్ని ఎత్తి చూపుతుంది. అయితే అందంగా, ఆరోగ్యమైన చర్మం కోసం ఖరీదైన క్రీములు, ట్రీట్ మెంట్లు అవసరం అనుకుంటే మీరు పొరబడుతున్నట్టే! చర్మం, దాని పని తీరు వంటి అంశాలపై అవగాహనతో పాటు దానిని సంరక్షించుకోవటంలోని మెళకువలు తెలుసుకుంటే నిగనిగలాడే చర్మం ప్రతి ఒక్కరి సొంతం అవుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు.

 మృతకణాల పొరలు : మన శరీరంలో అతి పెద్ద అవయవం ‘చర్మం'. లోపలి భాగాలను కప్పిఉంచటమే కాదు, ఒక కవచంలా మనల్ని అంటి పెట్టుకుని ఉంటుంది. పైకి కనిపించే చర్మం పూర్తిగా 25- 30 అతిసన్నటి పొరల మృతకణాలతో తయారై ఉంటుంది . ప్రతీ 28-30 రోజులకోసారి కొత్త కణాలను తయారుచేసుకుంటుంది మన శరీరం. వాతావరణ కాలుష్యం, దుమ్మ ధూలితో చర్మం మలినమైనప్పుడు మృతకణాలు పూర్తిగా తొలగించుకునే శక్తి చర్మానికి లేదు. ఈ పరిస్థితిలో మృతకణాలు గనక పేరుకుపోతే చర్మం గరుగ్గా మారుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా సున్నిపిండి లాంటి పదార్థాలతో స్క్రబ్బింగ్ చేసుకొని మృతకణాలను తొలగించేందుకు మనవంతు సహాయం చేయాలి.

మెలనిన్ ‌: శరీర ఛాయను నిర్దేశించేది చర్మంలో ఉన్న మెలనిన్ శాతం. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత నల్లగా ఉంటుంది శరీర ఛాయ. ఎండలో తిరిగినప్పుడు సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని కాపాడటం కోసం శరీరం మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. అందుకే ఎండలో తిరిగినప్పుడు సన్‌టాన్ (చర్మం నల్లబడటం) అవుతుంది. అయితే మెలనిన్ ఎంత శక్తివంతమైనా సూర్యుడి ప్రతాపం నుంచి పూర్తిసంరక్షణ మాత్రం మనకందించలేదు. అందుకే ఎండలో తిరిగినప్పుడు తప్పనిసరిగా సన్‌టాన్ లోషన్‌ని వాడటం అలాగే సరైన దుస్తులతో సంరక్షించుకోవటం చేయాలి.

మృతకణాలు : చర్మం లోపలిపొర కింద ఉండే పొరని డెర్మిస్ అంటారు. ఇది మన చర్మానికి జీవాన్నిస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ ఉండే నరాల చివర్లు, రక్తనాళాలు, నూనె, శ్వేత గ్రంధులు స్పర్శని కల్పించటంతోపాటు చర్మం ఊపిరి పీల్చుకోవటానికి సహాయపడతాయి. అయితే వీటితోపాటు కొలాజెన్, ఎలాస్టిన్, కెరటిన్ అనే అతి ముఖ్యమైనవి కూడా డెర్మిస్ పొరలో ఉంటాయి. పీచులాగా సాగే గుణం ఉన్న మాంసకృత్తులు ఇవి. మన శరీర పటుత్వం, ఆరోగ్యం, వంచ గలిగే శక్తిని ఎలాస్టిన్ నిర్దేశిస్తే, కొలాజన్ వృద్ధాప్యపు జాడలతో పోరాటం చేస్తుంది. కెరటిన్ శరీర దారుఢ్యాన్ని పెంచి హుషారుగా ఉంచుతుంది .

కొలాజెన్ : కొలాజెన్ మన చర్మాన్ని శరీరంతో పాటే పట్టివుంచేలా దోహదపడుతుంది. కెరటిన్‌ తో కలిసి ఇది మన శరీరానికి ఎంతోమేలు చేస్తుంది. శరీరంలో, చర్మంలో జరిగే మార్పులకి కొలాజెన్ ప్రమేయం ఉంది. కనుక దీన్ని తయారు చేసుకోగలిగే శక్తి శరీరానికి ఉంటే అమృతం తాగిన దేవతల్లా నిత్యయవ్వనంతో ఉండిపోవచ్చు. వృద్ధాప్యపు ఛాయ కూడా దరిచేరకుండా చేస్తుంది. అయితే దురదృష్టవశాత్తు వయసు పైబడే కొద్దీ కొలాజెన్ తగ్గిపోవటం వలన చర్మం పలచగా తయారవ్వటమే కాదు పటుత్వం కోల్పోయి ముడతలు పడుతుంది. ఇలా జరగకుండా మనం తినే ఆహారం ద్వారా మన శరీరానికి అవసరమైనంత కొలాజెన్‌ను అందించవచ్చు. కొన్ని రకాల విటమిన్లు, యాంటిఆక్సిడెంట్స్, అమినో యాసిడ్స్...అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవటం ద్వారా దీన్ని సాధించవచ్చు.

కొన్ని ఆహారపదార్థాలు వయసు కనిపించనీయకుండా చర్మం మెరిసేలా చేస్తాయి. అవి  నిత్యయవ్వనంగా మార్చే కొలాజెన్ ఆహారాలు..


  • పాలకూర :
విటమిన్‌ ఎ, బీటా కెరాటిన్‌లు వయసు ఛాయలు రాకుండా చర్మాన్ని కాపాడతాయి. ఇవి పాలకూరలో పుష్కలంగా ఉంటాయి. దీనిని రోజూ ఆహారంలో తీసుకుంటే నలభైలలో కూడా చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.


  • సబ్జా గింజలు :
చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో సబ్జాగింజలు ముందుంటాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. రోజూ ఒక స్పూను సబ్జాగింజల్ని తింటే చర్మం యౌవనంగా ఉంటుంది.






  • టొమాటోలు :
ఇందులో లైకోపీన్‌ చర్మానికి మంచి మెరుపుని అందిస్తుంది. ఇందులో యాంటీ ఏజింగ్‌ లక్షణాలు చాలా ఎక్కువ. కాలుష్యం నుంచి, హానికారక సూర్యకిరణాల నుంచి లైకోపీన్‌ కాపాడుతుంది.


  • బాదం :
చర్మ సౌందర్యానికి ఎంతో అవసరమయ్యే విటమిన్‌ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు బాదం పలుకుల్లో పుష్కలంగా ఉంటాయి. రోజూ నాలుగు బాదం పలుకుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన తింటే మంచిది.


  •  బ్లూ బెర్రీస్: 
ఇందులో ఉండే యాంటిఆక్సిడెంట్స్... కణాలు ఆక్సిజన్‌ను ఉపయోగించుకున్న తరవాత విసర్జించిన ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే హానిని రిపెయిర్ చేయటానికి ఉపయోగపడతాయి. ఇవి సమృద్దిగా ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల కొలాజెన్ ఉతపత్తి పెంచవచ్చు. కిస్‌మిస్, టమాటా, వెల్లుల్లి, ద్రాక్షా, పప్పుదినుసులు, సోయా, గ్రీన్ టీ, పాలకూర...


  • సాల్మన్ ఫిష్:
  సాల్మన్ ఫిల్ లో ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటాయి. ఈ ఒమేగా యాసిడ్స్ మన శరీరానికి ఎంతో ఉపయోగపడి, కొలాజెన్ ఉత్పత్తి పెరగటానికి తోడ్పడే వీటిని మన శరీరం తయారుచేసుకోలేదు. మనం తినే ఆహారం ద్వారానే వీటిని సమకూర్చాలి. చేపలు (ముఖ్యంగా సాల్మన్, ట్యునా వెరైటీ), జీడిపప్పు, బాదాం పప్పు. ఇది కొలాజెన్ ఉత్పత్తికి ఎంతో కీలకమైనది.


  • సోయా ప్రొడక్ట్స్: 
సోయా ప్రొడక్ట్ లో కూడా విటమిన్ సి తో పాటు జింక్ కూడా అధికంగా ఉంటుంది. సోయా మిక్క్ మొటిమలు, మచ్చలు పోగొట్టి, చర్మసమస్యలను దూరం చేస్తుంది. నిర్జీవమైన చర్మాన్ని తాజాగా చేసి ఫ్రెష్ గా మార్చుతుంది. కాబట్టి సేయాబేస్డ్ ప్రొడక్ట్ , సోయా పాలు తాగడం మంచిది.


  • క్యారెట్స్: 
క్యారెట్స్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇంకా ఇందులో ఉండే బీటా కెరోటీ అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు ఇవ్వటంతో పాటు చర్మానికి, కురులకు మంచి ప్రయోజనాలను చేకూర్చుతాయి. కాబట్టి మెరిసేటటువంటి చర్మ సౌందర్యం పొందాలనుకుంటే ప్రతి రోజూ క్యారెట్ తినడం కానీ, లేదా క్యారెట్ జ్యూస్ తాగడం కానీ చేయాలి.


  • కీర దోస:
  దోసకాయను తొక్కుతో తినడం మంచిది. తొక్కులో విటమిన్‌ 'కె' సమృద్ధిగా ఉంటుంది. చర్మానికి మేలు చేసే గుణం దోస తొక్కులో వుంది. దోసకాయ మంచిది కదా అని ఊరగాయల రూపంలో తినకూడదు. కీరదోసకాయ రసాన్ని ముఖానికి పట్టిస్తే నల్లటి మచ్చలు పోతాయి.


  •  అరటి: 
ముఖానికి రిఫ్రెషనస్ బనానా అరటిపండును చర్మ సంరక్షణ గ్రేట్ మాయిశ్చరైజర్ అని చెప్పవచ్చు. బనానా మాయిశ్చరైజర్ తో ముఖానికి రిఫ్రెషనస్ వస్తుంది.









  • ఆరెంజ్: 
వృద్ధాప్య ప్రక్రియలో ఆరెంజ్ ఆరెంజ్ లో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని బాగా ఉపయోగపడుతుంది. సి విటమిన్ చర్మానికి మంచి మెరుగును అందిస్తుంది. విటమిన్ ఇ, ఎ, సి . కొలాజెన్ ఉత్పత్తికి,మెయింటెన్ చేయటానికి సహాయపడే వీటిని తినే ఆహారం ద్వారా సులువుగా శరీరానికి అందించవచ్చు.


  •  బొప్పాయి: 
బొప్పాయి బొప్పాయిన మన పూర్వీకుల నుండి ఉపయోగిస్తున్నారు. పాపాయలో ఎక్కువగా యాంటీఆక్సిడెంట్స్ మరియు ఎంజైములను ఫుష్కలంగా...










  •  ఆపిల్స్: 
యాపిల్ ను ఆహరంలో ఓ భాగంగా చేసుకోవాలి. ఈ పాండులో లబించే పోtaశియం, ఫాస్ఫరస్ చాల మేలు చేస్తుంది.

  • వేరు శనగ :
వేరు శనగల్లో అధిక మోతాదులో ఉండే విటమిన్ ఇ, సిలీనియం, జింక్ శరీర సౌందర్యానికి కావలసిన హార్మోన్ ల ఉత్పత్తిలో సహకరిస్తాయి. రక్తప్రసరణ మెరుగుపరచి మంచి ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యానికి ఉపకరిస్తాయి.


  • బీట్ రూట్: 
రూట్ దుంపల్లో అధిక శాతంలో ఐరన్ మరియు విటమిన్స్ ఉండి, చర్మగ్రంధులను శుభ్రం చేయడానికి, రక్త ప్రసరణ జరగడానికి, ముఖంలో పింక్ గ్లో తేవడానికి సహాయపడుతాయి. కాబట్టి ప్రతి రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగాలి. అలాగే దీన్ని ఫేస్ ఫ్యాక్ గా కూడా వేసుకోవచ్చు. జింక్, సల్ఫర్ పళ్లు,కాయగూరల్లో లభ్యమయ్యే ఈ ఖనిజాలు కొలాజెన్ ఉత్పత్తిని పెంచి సంరక్షిస్తాయి.


  • కివి: 
కివి ఇది ఒక సిట్రస్ ఫ్రూట్. ఇందులో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది సహజంగా చర్మ ఛాయను మార్చడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ కివి పండును తాజాగా తినవచ్చు. మరియు ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు, ముఖంలో రంద్రాలు తొలగిపోయి, ముఖ్యం బ్యూటిఫుల్ గా కనబడుతుంది.


  • నీరు: 
వయస్సును తగ్గించడంలో ప్రతి రోజూ మనం తీసుకొనే డైయట్ లో నీరు కూడా ఒక భాగమే. నీరు ఇంటర్నల్ గాను, ఎక్సటర్నల్ గాను మంచి ప్రయోజనకారి. ప్రతి రోజూ ఎనిమిది నుండి పది గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరానకి కావల్సిన తేమ అంది ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజు క నీసం 6-8 గ్లాసుల నీళ్లు తాగటం అన్నది స్వేదగ్రంథుల నుంచి విషపదార్థాలను బయటికి విసర్జించటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

Source: http://food-health-disease.blogspot.in/